Future Group: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానం దేశంలో అనేక మందికి ఇష్టమైన ప్రదేశం. అయితే తన వ్యాపారాన్ని అత్యుత్తమంగా నిర్వహించటానికి తిరుమలకు వెళ్లి కొన్ని విషయాలు నేర్చుకున్నట్లు ఫ్యూచర్ రిటైల్ గ్రూప్ అధినేత కిషోర్ బియానీ వెల్లడించారు.
దేశంలో చాలా ప్రాచుర్యం పొందిన బిజ్ బజార్ స్టోర్ల యజమాని కిషోర్ బియానీ. ఇటీవల ఒక పాడ్కాస్ట్ లో మాట్లాడుతూ తన వ్యాపారానికి తిరుమల శ్రీవారి ఆలయానికి ఉన్న సంబంధాన్ని వెల్లడించారు. ఒకనొక సమయంలో తమ Big Bazaar స్టోర్లకు భారీగా కస్టమర్లు వచ్చేవారని బియానీ అన్నారు. అయితే ఇంత భారీ సంఖ్యలో వస్తున్న జన సమూహాలను నిర్వహించటం గురించి నేర్చుకునేందుకు తిరుమల ఆలయాన్ని సందర్శించినట్లు వెల్లడించారు.

ప్రఖ్యాత బ్రోకరేజ్ సంస్థ జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ తో జరిగిన పాడ్కాస్ట్ లో కిషోర్ బియానీని 'గాడ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ రిటైల్' అని ప్రశంశించారు. ప్రస్తుతం దేశంలో పాపులర్ అయిన డీమార్ట్ స్టోర్ల రాకకు ముందు మధ్యతరగతి రిటైల్ వినియోగదారులు ఎక్కువగా బిగ్ బజార్ స్టోర్లలో షాపింగ్ చేసేవారు.
2001లో ఫ్యూచర్ రిటైల్ కింద ప్రారంభమైన బిగ్ బజార్ భారీ తగ్గింపులకు ఉత్పత్తులను అందిచటంతో మార్కెట్లో ప్రసిద్ధి చెందింది. దేశవ్యాప్తంగా 125 నగరాల్లో సంస్థకు దాదాపు 250 స్టోర్లను కలిగి ఉంది. కంపెనీ విజయవంతంగా నడిచినప్పటికీ.. దేశంలో ఈ-కామర్స్ వృద్ధి, నిధుల కొరత వంటి అనేక కారణాలు కంపెనీని నష్టాల్లోకి నెట్టాయి. దీంతో వ్యాపారాన్ని రూ.24,713 కోట్లకు ముఖేష్ అంబానికి విక్రయించటంతో అమెజాన్ నుంచి చిక్కులు మెుదలయ్యాయి.
ప్రస్తుతం ఈ వ్యవహారం సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ న్యాయస్థానంలో తీర్పు కోసం పోరు కొనసాగుతోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications