పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా, వివిధ నగరాల్లో ఎలా ఉన్నాయంటే
ముంబై: పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (జూన్ 10, గురువారం) స్థిరంగా ఉన్నాయి. నిన్న లీటర్ పెట్రోల్ ధర 25 పైసలు పెరిగింది. గత నెలలో పెట్రోల్ డీజిల్ ధరలు 16సార్లు పెరిగాయి. ఈ నెలలో ఆ 10 రోజుల్లో ఐదుసార్లు పెరిగాయి. దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీల ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.56, లీటర్ డీజిల్ రూ.86.47గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.101.76, డీజిల్ రూ.93.85కి చేరుకుంది.
గత మే నాలుగో తేదీ నుండి చమురు ధరలు పదహారుసార్లు, జూన్ నెలలో ఐదుసార్లు పెరిగాయి. ఈ కాలంలో లీటర్ పెట్రోల్ పైన రూ.5.16, డీజిల్ పైన రూ.5.74 పెరిగింది. అంటే దాదాపు రూ.5 నుండి రూ.6 మధ్య పెరిగింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లడక్ ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 కంటే పైకి చేరుకుంది.
రాజధాని నగరాల్లో భోపాల్, ముంబై, జైపూర్లలో రూ.100 కంటే పైకి చేరుకుంది. రాజస్థాన్లోని శ్రీ గంగానగర్లో లీటర్ పెట్రోల్ ధర రూ.106.64, లీటర్ డీజిల్ రూ.99.50కి చేరుకుంది. మధ్యప్రదేశ్ అన్నుపూర్లో లీటర్ పెట్రోల్ రూ.10.29, లీటర్ డీజిల్ రూ.97.44గా ఉంది.