Fuel Prices: స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు: 100 డాలర్ల పైకి క్రూడ్
పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (జూలై 08, శుక్రవారం) స్థిరంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మే 21వ తేదీన లీటర్ పెట్రోల్ పైన రూ.8, లీటర్ డీజిల్ పైన రూ.6 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. అప్పటి నుండి కూడా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ధరలను స్థిరంగా కొనసాగిస్తున్నాయి. కేంద్రం ఎక్స్చైజ్ డ్యూటీని తగ్గించిన తర్వాత ఢిల్లీలో రూ.9.5, లీటర్ డీజిల్ రూ.7 తగ్గింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62గా ఉంది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.109.66, లీటర్ డీజిల్ రూ.97.82గా ఉంది.
దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తాయి. ఇటీవల చమురు రంగ సంస్థలు పెట్రోల్, డీజిల్ పైన నష్టాలను చవిచూస్తున్నాయి. ప్రభుత్వరంగ కంపెనీలు అయితే ప్రభుత్వమే నష్టాన్ని భరిస్తుంది. అయితే కొన్ని ప్రయివేటు కంపెనీలు ఈ నష్టాన్ని భర్తీ చేసుకోవడం కోసం ధరలను స్వల్పంగా పెంచాయి. ప్రభుత్వరంగ పెట్రోల్ బంకుల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.110 ఉంటే, ప్రయివేటు పెట్రోల్ బంకుల్లో రూ.5 పెంచి, రూ.115 వరకు తీసుకుంటున్నారు.
మహారాష్ట్ర
ముఖ్యమంత్రి
ఏక్నాథ్
షిండే
పెట్రోల్,
డీజిల్
పైన
వ్యాట్ను
తగ్గించారు.
దీంతో
మహారాష్ట్రలో
ధరలు
తగ్గాయి.
లీటర్
పెట్రోల్
ధర
రూ.111.13కు,
లీటర్
డీజిల్
ధర
రూ.97.28గా
ఉంది.
అంతర్జాతీయ
మార్కెట్లో
ఇంధన
ధరలు
ఇటీవల
100
డాలర్లకు
దిగువకు
వచ్చినప్పటికీ,
మళ్లీ
ఆ
పైకి
చేరుకున్నాయి.
కొద్దిరోజుల
క్రితం
120
డాలర్ల
స్థాయికి
కూడా
చేరుకుంది.
బ్రెంట్
క్రూడ్
ప్రస్తుతం
104
డాలర్ల
వద్ద,
వెస్ట్
టెక్సాస్
ఇంటర్మీడియేట్
102
డాలర్ల
వద్ద
కదలాడుతోంది.