IT News: దేశంలోని ఐటీ కంపెనీలు కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఇది ప్రస్తుతానికి బయటకు రానప్పటికీ.. పెద్ద సమస్యలను సృష్టించగలదని తెలుస్తోంది. ఇది టెక్ రంగంలోని ఉద్యోగులను తీవ్రంగా ప్రభావితం చేసే ప్రమాదం ఉంది.
కొత్త ఏడాది భారత ఐటీ కంపెనీలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఒకపక్క అమెరికాలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నప్పటికీ.. టెక్ కంపెనీల వ్యాపారం మెరుగుపడకపోవటం ఆందోళనకు దారితీస్తోంది. కరోనా సమయంలో భారతీయ ఐటీ కంపెనీలు ఊహించని విధంగా అధికస్థాయిలో చిన్న ప్రాజెక్టులను అందుకున్నాయి.

అయితే కంపెనీల దీర్ఘకాలిక వృద్ధికి 500 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన ప్రాజెక్టులు చాలా ముఖ్యం. ఇదే క్రమంలో 100-500 మిలియన్ డాలర్ల మధ్య విలువైన చిన్న ప్రాజెక్టులు చాలా కీలకం. ఈ చిన్న ప్రాజెక్టుల ద్వారా ఎక్కువ లాభాలు ఆర్జించడమే కాకుండా ఎక్కువ మందికి ఉపాధి కల్పనకు, కొత్త ఉద్యోగాల కల్పనకు తోడ్పడుతుంది. కొన్ని సార్లు ఈ చిన్న ప్రాజెక్టుల విజయవంతం పెద్ద ప్రాజెక్టులను ఆకర్షించేందుకు పునాదిగా నిలుస్తాయి కూడా.
ప్రస్తుతం అంతర్జాతీయంగా వ్యాపారంలో ఉన్న ఆర్థిక అస్థిరతల నేపథ్యంలో దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీలకు చాలా తక్కువ సంఖ్యలో పెద్ద ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇదే సమయంలో కంపెనీల ఆదాయాలకు కీలకమైన చిన్న ప్రాజెక్టులు దాదాపుగా రావటం తగ్గిపోయింది. ఫలితంగా 2024లో భారతీయ ఐటీ సేవల కంపెనీల లాభాలు, ఆదాయాలు నెమ్మదిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఇన్ఫోసిస్ కంపెనీలో సీనియర్ స్థాయి అధికారులు రాజీనామాలు ఉద్యోగులను అయోమయంలోకి నెట్టేస్తున్నాయి.

అంతర్జాతీయంగా ఉన్న మాంద్యం భయాలతో కేవలం నిధులు అధికంగా ఉండే కంపెనీలు మాత్రమే విస్తరణ ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో దేశీయ ఐటీ సేవల కంపెనీలకు కొత్త ప్రాజెక్టుల రాక భారీగా తగ్గింది. అయితే ప్రస్తుత పరిస్థితుల కారణంగా టెక్ ఉద్యోగులు నేరుగా ప్రభావితం కానప్పటికీ.. వారికి అందించే జీతం, వేరియబుల్ పే, కొత్త ఉద్యోగులకు ఆఫర్ చేసే ప్యాకేజీలపై ప్రభావితం ఉండవచ్చని టెక్ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. పైగా ప్రాజెక్టులు లేకపోవటం వల్ల కొత్త నియామాలు తగ్గి.. బెంచ్ పై ఉండే టెక్కీల సంఖ్య పెరుగుతోంది. అట్రిషన్ రేటు కూడా తక్కువగానే ఉంటోంది.


Click it and Unblock the Notifications