IT News: కరోనాను అందరూ ఇప్పుడిప్పుడే మరిచిపోతున్నప్పటికీ.. ఐటీ ఉద్యోగులు మాత్రం ఇంకా ఆ కాలం నుంచి బయటకు రావటం లేదు. అప్పట్లో కంపెనీ అందించిన వర్క్ ఫ్రమ్హోమ్ వారిని ఇంకా వెంటాడుతూనే ఉంది. కావాలంటే జామ్ మానేస్తాం కానీ ఆఫీసులకు తిరిగి రాబోమని చాలా మంది అంటున్నారు.
దేశంలోని అతిపెద్ద వైట్ కాలర్ యజమానులు, ఐటీ సేవల దిగ్గజాలు దీనిని మార్చేందుకు ఉద్యోగులను ఆఫీసులకు పిలిచే ట్రెండ్లో ముందున్నాయి. 2021-22 తారాస్థాయి నుంచి అనుసరించి జాబ్ మార్కెట్ ప్రస్తుతం కూల్ అయ్యింది. దీంతో ఇప్పుడు ఉద్యోగులు తప్పకుండా ఆఫీసులకు తిరిగి రావాల్సిందేనని కంపెనీలు పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ తన ఉద్యోగులను వారానికి 5 రోజులు ఆఫీసులకు రావాల్సిందేనని తేల్చి చెప్పింది. తాజాగా ఉద్యోగులను ట్రాన్ఫర్ చేయటం కూడా పెద్ద వివాదంగా మారింది.

ఆఫీసులకు రమ్మనటం గురించి టీసీఎస్ తొలుత ప్రకటించగానే చాలా మంది మహిళా ఉద్యోగులు కంపెనీని వీడటం మనం గమనించాం. పురుషుల కంటే మహిళలు ఎక్కువగా FY23లో జాబ్స్ టీసీఎస్ లో వదిలేయగా.. కంపెనీ మాత్రం ముందుకే కొనసాగింది. గడచిన రెండేళ్లుగా సహకారం, మెంటర్షిప్, టీమ్-బిల్డింగ్ వంటి ముఖ్యమైన అంశాలు చాలా దెబ్బతిన్నాయని సంస్థ CHRO మిలింద్ లక్కడ్ తెలిపారు.
ఇక ఇతర టెక్ దిగ్గజాల తీరును గమనిస్తే.. నవంబర్ 20 నుంచి ప్రారంభ, మధ్య స్థాయి ఉద్యోగులు కనీసం నెలలో 10 రోజులు ఆఫీసు నుంచి పని చేయాలని ఇన్ఫోసిస్ తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే వారంలో మూడు రోజులు కార్యాలయానికి రావాలని.. బెంగళూరుకు చెందిన విప్రో, నోయిడాకు చెందిన హెచ్సిఎల్ టెక్నాలజీస్ తమ ఉద్యోగులను తెలిపాయి. అలాగే క్యాప్ జెమినీ, LTIMindtree వంటి కంపెనీలు కూడా ఇదే దారిని ఎంచుకున్నాయి.
తాజాగా CIEL HR సర్వీసెస్ సర్వే ప్రకారం.. 10 మంది ఉద్యోగుల్లో నలుగురు ఆఫీసులో కానీ హైబ్రిడ్ ఫ్రేమ్వర్క్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక మహిళా ఉద్యోగుల విషయానికి వస్తే ప్రతి పదిమందిలో 5 మంది ఇప్పటికీ రిమోట్ వర్క్ను ఫ్లెక్సిబిలిటీతో ఇష్టపడుతున్నట్లు వెల్లడైంది. ఉద్యోగులను ఆఫీసులకు రప్పించటం కంపెనీలకు పెద్ద సవాలుగా మారుతోందని నివేదిక పేర్కొంది. కంపెనీల్లోని అట్రిషన్ రేటు దీనిని ప్రతిబింబిస్తోంది. వ్యాపారాలను సాఫీగా కొనసాగించేందుకు వీటికి కంపెనీలే మంచి పరిష్కార మార్గాలను అన్వేషించాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. కంపెనీలు సైతం స్లో పాయిజన్ గా మారిన వర్క్ఫ్రమ్ హోమ్ విధానానికి విరుగుడును క్రమంగా అవలంభిస్తాయని వారు అంటున్నారు.
More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications