ప్రపంచంలోని టాప్ కంపెనీలకు సీఈఓలు..అందరూ చదివింది మన హైదరాబాద్ స్కూల్లోనే..

హైదరాబాద్లో ఉన్న దేశపు ప్రముఖ విద్యాసంస్థల్లో ఒకటి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (HPS), బేగంపేట్. ఇది ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన నాయకులను తయారుచేసే విషయంలో ప్రసిద్ధి పొందింది.

షైలేష్ జేజూరికర్‌ను జూలై 29న ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ (P&G) గ్లోబల్ CEOగా నియమించారు. ఇప్పటి వరకు ఆయన ఆ సంస్థలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పని చేశారు. ఆయన 2026 జనవరి నుండి కొత్త పదవిని చేపట్టనున్నారు. 58 ఏళ్ల జేజూరికర్, IIM లఖ్నోలో చదివారు. అలాగే, గ్లోబల్ స్థాయిలో ఉన్న భారతీయ CEOs - సుందర్ పిచై (గూగుల్), సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్) వంటి ప్రముఖుల సరసన చేరారు. శైలేష్ జేజూరికర్ కూడా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లోనే విద్యను పూర్తి చేశారు.

HPS CEO Hyderabad Public School HPS Begumpet Jagirdars College Nizam Mir Osman Ali Khan H Wakefield Eton College CEO Factory Satya Nadella Shantanu Narayen Ajay Banga Shailesh Jejurikar Prominent Alumni Education Hyderabad

అయితే జేజూరికర్ మాత్రమే కాదు 100 ఏళ్లు దాటి ఉన్న ఈ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీలకు నాయకులుగా ఎదిగిన విద్యార్థులు ఎందరో ఉన్నారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల, జేజూరికర్ స్కూల్‌లో క్లాస్‌మేట్స్. ఇప్పటికీ వీరిద్దరూ స్నేహితులుగా ఉన్నట్టు సమాచారం.

ఈ గొప్ప పాఠశాల ప్రారంభం 1923లో 'జాగీర్దార్స్ కాలేజ్'గా జరిగింది. ఏడవ నిజాం మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో స్థాపించబడిన ఈ పాఠశాల, బ్రిటిష్ అధికారి హెచ్. వీక్ ఫీల్డ్ సూచనలతో ప్రారంభమైంది. ఆయన 1919లో లండన్‌లోని ఈటన్ కాలేజ్ తరహాలో హైదరాబాదులో ఒక నివాస పాఠశాల ఏర్పాటుపై ప్రతిపాదన చేశారు. ఇది నవాబు, జాగీర్దార్ల పిల్లలకు ఉత్తమ విద్య అందించాలన్న ఉద్దేశంతో ప్రారంభమై, 1950 తర్వాత జీవన్దారీ వ్యవస్థ రద్దయ్యాక పబ్లిక్ స్కూల్‌గా మారింది.

బేగంపేట్‌లో 140 ఎకరాల విస్తీర్ణంలో Hyderabad Public School (HPS) ఉంది. పాతకాలపు ఇండో-సారసెనిక్ శైలిలో నిర్మించిన భవనాలు అద్భుతంగా కనిపిస్తాయి. ఇందులో ఆధునిక తరగతిగదులు, గ్రంథాలయం, క్రీడా మైదానాలు, సైన్స్ ల్యాబ్‌లు, హాస్టల్ వసతులు ఉన్నాయి. 1988 నుండి బాలికలకూ ప్రవేశం కల్పించారు. ఇప్పుడు ఇది దేశంలోనే అతిపెద్ద పాఠశాలలలో ఒకటిగా, డే/రెసిడెన్షియల్ స్కూల్‌గా ప్రసిద్ధి చెందింది.

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలను నడిపిస్తున్న ప్రముఖులు ఇక్కడ చదువుకున్నవారు.

సత్య నాదెళ్ల: మైక్రోసాఫ్ట్ CEO

శంతను నారాయణ్: అడోబ్ CEO

అజయ్ బంగా: వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్, మాజీ మాస్టర్ కార్డ్ CEO

షైలేష్ జేజూరికర్: ప్రొక్టర్ & గ్యాంబుల్ గ్లోబల్ CEO డిజిగ్నేట్

ఇతర ప్రముఖ పూర్వ విద్యార్థులు:

గిరిష్ రెడ్డి (ప్రిస్మా క్యాపిటల్)

హర్ష భోగ్లే (క్రికెట్ వ్యాఖ్యాత)

అసదుద్దిన్ ఓవైసీ (MP, AIMIM అధ్యక్షుడు)

కిరణ్ కుమార్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి (మాజీ ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్)

ప్రేం వాట్సా (CEO, ఫెయిర్ఫ్యాక్ష్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్)

సయ్యద్ అక్బరుద్దిన్ (మాజీ రాయబారి)

ప్రస్తుతం హెచ్పీఎస్‌లో ఉండే (సహవాస) లేదా వచ్చి వెళ్లే విద్యార్థులకు మంచి చదువు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, ఇంకా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు అందించబడుతున్నాయి. ఇందులో చదివేందుకు ప్రతి సంవత్సరం సుమారు రూ.1,71,000 నుంచి రూ.2,25,000 వరకు ఫీజు ఉంటుంది.

ప్రపంచానికి పేరుగాంచిన CEO ల్ని తయారు చేసిన స్కూల్‌గా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ గుర్తింపు పొందింది. భారత దేశ విద్యా రంగంలో ఇది గొప్ప పాఠశాలగా, నాణ్యతను కొనసాగిస్తూ శతాబ్ద కాలంగా ముందుకు సాగుతోంది.

ఒక్క ఐటీ, కార్పొరేట్ రంగాలే గాక, ఈ స్కూల్ రాజకీయ, సినిమా, క్రీడ, సైన్య రంగాలకు కూడా అత్యున్నత మందిని అందించింది. ఉదా: అక్కినేని నాగార్జున, రామ్ చరణ్, దగ్గుబాటి వెంకటేష్ (చిత్రసీమలో), కె.ఎన్.బాపిరాజు, మల్లిపూడి మంగపతి పళ్ళంరాజు (రాజకీయ నేతలు), దినేష్ రెడ్డి, సీవీ ఆనంద్ (ఉన్నత పోలీస్ అధికారులు).

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+