GST Meeting: మోదీ సర్కార్ మూడో విడతలో రెండవసారి కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. పదవిలోకి రాగానే ఆమె 53వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. దీనిలో ప్రకటించిన కొన్ని కీలక నిర్ణయాలు ప్రజలకు ఎలాంటి ఊరటను కలిగించనున్నాయో చూద్దాం..
- భారతీయ రైల్వే ప్లాట్ఫారమ్ టిక్కెట్లపై ఇక నుంచి జీఎస్టీ విధించబడదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దీంతో పాటు స్టేషన్ లోని రిటైరింగ్ రూమ్ సౌకర్యాలు, వెయిటింగ్ రూమ్లు, క్లాక్ రూమ్ సేవలు, బ్యాటరీతో నడిచే కార్ల సేవలను సైతం జీఎస్టీ నుంచి మినహాయిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. అలాగే అంతర్-రైల్వే సరఫరాలకు కూడా మినహాయింపు ఇవ్వబడుతుంది.

- విద్యా సంస్థల వెలుపల హాస్టళ్లుగా అందించే సేవలకు ప్రతి వ్యక్తికి నెలకు రూ.20,000 మినహాయింపును GST కౌన్సిల్ మంజూరు చేసింది. ఈ తగ్గింపు విద్యార్థులు లేదా శ్రామిక తరగతి కోసం. కనీసం 90 రోజులు బస చేసినట్లయితే దీనిని పొందవచ్చు.
- జీఎస్టీ తాజా సమావేశంలో అన్ని రకాల కార్టన్ బాక్స్లు, పేపర్ బోర్డులపై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించాలని సిఫార్సు చేశారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్ యాపిల్స్ కార్టన్ బాక్స్లపై జీఎస్టీని తగ్గించాలని నిరంతరం డిమాండ్ చేస్తున్నాయి. ఈ తగ్గింపు పండ్ల తోటల పెంపకందారులకు, పరిశ్రమలకు ఖర్చును ఆదా చేయడంలో సహాయపడనుంది.
- సోలార్ కుక్కర్లపై 12 శాతం జీఎస్టీ విధించాలని నిర్ణయించారు.
- అన్ని పాల డబ్బాలపై ఏకరీతి రేటు 12 శాతంగా నిర్ణయించాలని జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సు చేసింది. దీని ప్రకారం.. స్టీల్, ఐరన్, అల్యూమినియం, ఏ రకమైన పాల డబ్బాలపై అయినా ఇది వర్తిస్తుంది.
- జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం ప్రకారం ఫైర్ వాటర్ స్ప్రింక్లర్లతో సహా అన్ని రకాల స్ప్రింక్లర్లపై 12 శాతం జీఎస్టీ విధించబడుతుంది.
- బయోమెట్రిక్ ఆధారిత ఆధార్ ప్రమాణీకరణ ప్రారంభమవుతుంది. నకిలీ ఇన్వాయిస్ల ద్వారా చేసిన మోసపూరిత ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్లను ఎదుర్కోవడంలో ఇది సహాయపడుతుంది.
- జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్కు రూ.20 లక్షలు, హైకోర్టుకు రూ.కోటి, సుప్రీంకోర్టుకు రూ.2 కోట్ల ద్రవ్య పరిమితిని నిర్ణయించాలని సిఫార్సు చేయబడింది. GST కౌన్సిల్ నిర్దేశించిన పరిమితి కంటే ద్రవ్య పరిమితి తక్కువగా ఉంటే, పన్ను అధికారం సాధారణంగా అప్పీల్ చేయదు.
- అప్పీలేట్ అథారిటీ ముందు అప్పీల్ దాఖలు చేయడానికి ముందస్తు డిపాజిట్ గరిష్ట మొత్తాన్ని CGST, SGST కోసం రూ.25 కోట్ల నుంచి రూ.20 కోట్కు తగ్గించాలని కౌన్సిల్ సిఫార్సు చేసింది.
- ఎరువుల పరిశ్రమను ప్రస్తుతం ఉన్న 5 శాతం జీఎస్టీ నుంచి మినహాయించాలని జీఎస్టీ కౌన్సిల్ మంత్రుల బృందానికి సిఫారసు పంపింది. రేట్ల హేతుబద్ధీకరణ కోసం ఏర్పాటైన మంత్రుల బృందం ఇప్పుడు ఈ అంశాన్ని పరిశీలిస్తోంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications