భారత్‌లో కనపడకుండా దాక్కున్న ఏడు బంగారు గనులు..తవ్వకాలతో పసిడి కరువు తీరినట్లే ఇక..

బంగారం భారతీయులకు తరతరాల నుంచి ఎంతో ప్రత్యేకత ఉంది. బంగారాన్ని అమితంగా ప్రేమిస్తారు. ఇతర దేశాలతో పోలిస్తే.. భారతీయ సమాజంలో బంగారానికి ఉన్న ప్రాధాన్యం ఎంతో ప్రత్యేకమైనది. వివాహాలు, పండుగలు, సంప్రదాయ ఆభరణాలు మాత్రమే కాదు, పెట్టుబడుల రూపంలో కూడా బంగారం భారతీయుల జీవితాల్లో విడదీయరాని భాగంగా మారింది.

ఈ కారణంగానే దేశంలోని బంగారు గనులు భారత ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఖనిజ సంపదకు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన దేశాల జాబితాలో భారతదేశం ముందువరుసలో నిలుస్తుంది. ఇనుము, బొగ్గు, మాంగనీస్ వంటి ఖనిజాలతో పాటు, బంగారం కూడా భారత్‌కు అత్యంత కీలకమైన ఖనిజ వనరుగా ఉంది.

ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు వినియోగ దేశాల్లో ఒకటిగా భారత్ నిలుస్తోంది. ప్రతి ఏడాది విదేశాల నుంచి దాదాపు 800 మెట్రిక్ టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. అలాగే అపారమైన ఖనిజ సంపదను తన భూమిలోనే దాచుకుని ఉంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) గణాంకాల ప్రకారం.. భారత్‌లో 2,191.53 మెట్రిక్ టన్నుల Gold ఖనిజ వనరులు ఉన్నాయి. అయితే, వీటిలో చాలా భాగం ఇంకా పూర్తిగా రహస్యంగానే ఉండిపోయాయి.

gold mines in India hidden gold mines India unknown gold mines India India gold reserves gold mining in India unexplored gold deposits India Indian gold mines list gold discovery India mineral resources India gold production India mining industry India untapped gold reserves Karnataka gold mines Jharkhand gold deposits Rajasthan gold mines Arunachal Pradesh gold Chhattisgarh gold mines Indian minerals news gold exploration India India mining potential

దీని వల్ల దేశీయ బంగారు తవ్వకాలకు విస్తారమైన అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. భారత్ లో ఎవరికి తెలియని ఏడు బంగారు గనులు ఉన్నాయి. వాటి నుంచి బంగారాన్ని వెలికిలోకి తీస్తే పసిడి ప్రియుల కరువు తీరడమే కాకుండా.. భారత ఆర్థిక వ్యవస్థ రయ్యిన దూసుకుపోతుంది. ఆ గనులను ఓ సారి చూద్దాం.

కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (KGF): కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ భారత్‌లోనే అత్యంత పురాతనమైన, లోతైన బంగారు గనిగా ప్రసిద్ధి చెందింది. 1880లో బ్రిటిష్ పాలనలో ప్రారంభమైన ఈ గని, 2001 వరకు పనిచేసి దాదాపు 800 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేసింది. 3.2 కి.మీ లోతులో పనిచేయాల్సి రావడంతో అధిక ఉష్ణోగ్రతలు, తేమ, ఒత్తిడి వంటి తీవ్రమైన పరిస్థితులను కార్మికులు ఎదుర్కొన్నారు. ఆర్థిక, పర్యావరణ కారణాలతో మూసివేయబడిన ఈ గనిని, ఆధునిక సాంకేతికతతో మళ్లీ ప్రారంభించే ప్రణాళికలు ఉన్నాయి.

కర్ణాటకలోని హుట్టి గోల్డ్ మైన్స్: హుట్టి గోల్డ్ మైన్స్ ప్రస్తుతం భారత్‌లో ఏకైక క్రియాశీల Gold గనిగా ఉంది. కర్ణాటక ప్రభుత్వ సంస్థ నిర్వహిస్తున్న ఈ గని.. ఏడాదికి సుమారు 1.8 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంది. మహాభారతం, రామాయణం వంటి పురాతన గ్రంథాల్లో దీని ప్రస్తావన ఉండడం వల్ల, దీనికి 2 వేళ ఏళ్ల చరిత్ర ఉందని చెబుతారు.

ఉత్తరప్రదేశ్ లోని సోన్‌భద్ర : 2020లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) సోన్‌భద్ర జిల్లాలో భారీ బంగారు నిల్వలను గుర్తించింది. సుమారు 700 టన్నుల బంగారు ఖనిజం ఐదు ప్రాంతాల్లో ఉన్నట్లు అంచనా. ఇది ఉత్తరప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి, దేశీయ బంగారు ఉత్పత్తికి కీలకంగా మారవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

కర్ణాటకలోని గనజూర్ గోల్డ్ మైన్: గోవా సరిహద్దుకు సమీపంలో ఉన్న గనజూర్ గని.. డెక్కన్ గోల్డ్ మైన్స్ ఆధ్వర్యంలో ఉంది. ఒక దశలో ఉత్పత్తి ప్రారంభించాలనే ప్రణాళికలు ఉన్నప్పటికీ, మైనింగ్ లీజు సమస్యల కారణంగా ఈ గని ఇంకా పూర్తిస్థాయిలో ముందుకు రాలేదు.

ఆంధ్రప్రదేశ్ లోని జొన్నగిరి గోల్డ్ మైన్: తెలంగాణ సరిహద్దుకు సమీపంలో ఉన్న జొన్నగిరి గని.. భారత్‌లోనే తొలి ఓపెన్-పిట్ బంగారు గనిగా మారే అవకాశముంది. ఇది ఏడాదికి సుమారు 1.2 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేయగలదని అంచనా.

జార్ఖండ్ లోని లావా గోల్డ్ మైన్స్: చాండిల్ ప్రాంతంలోని లావా గని ఇంకా పూర్తిగా అన్వేషించబడలేదు. అయితే, ఈ ప్రాంతంలోని ఖనిజ నిక్షేపాలు దీనిని భవిష్యత్తులో కీలక గనిగా మారుస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని రామగిరి గోల్డ్ మైన్ : 1905-27 మధ్య బ్రిటిష్ సంస్థల ఆధ్వర్యంలో పనిచేసిన రామగిరి గనిలో సుమారు నాలుగు టన్నుల బంగారు ఖనిజం ఉందని అంచనా. ప్రస్తుతం MECL ఈ గనిని పునరుద్ధరించే దిశగా అధ్యయనాలు చేస్తోంది.

వీటితో పాటుగా కడప, చిత్తూరు జిల్లాల కొన్ని ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలను గుర్తించారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగిరి ప్రాంతం కూడా చారిత్రకంగా బంగారు గనులకు పేరుగాంచింది. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో పరిమిత స్థాయిలోనే అన్వేషణలు జరుగుతున్నాయి. ఇవి కాకుండా ఝార్ఖండ్‌లోని సింగ్‌భూమ్ జిల్లా, రాజస్థాన్‌లోని బనాస్‌వారా, ఉదయ్‌పూర్ ప్రాంతాలు, కేరళలోని వయనాడు జిల్లా వంటి ప్రాంతాల్లో కూడా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే పర్యావరణ పరిరక్షణ, అటవీ ప్రాంతాల రక్షణ కారణంగా ఇక్కడ పెద్దఎత్తున తవ్వకాలకు పరిమితులు విధించారు.

అయితే బంగారు తవ్వకాలు సులభమైన ప్రక్రియ కాదు. లోతైన గనులు, అధిక వ్యయం, పర్యావరణ సమస్యలు, ఆధునిక సాంకేతిక అవసరాలు వంటి అనేక సవాళ్లు ఈ రంగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అయినప్పటికీ, దిగుమతులపై ఆధారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కొత్త అన్వేషణలు, ఆధునిక మైనింగ్ పద్ధతులను ప్రోత్సహిస్తోంది. సరైన విధానాలు, పెట్టుబడులు అమలులోకి వస్తే, భారతదేశం బంగారు ఉత్పత్తిలో స్వయం సమృద్ధి దిశగా ముందుకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.సరైన విధానాలు, పెట్టుబడులు, ఆధునిక సాంకేతికత అమలులోకి వస్తే, ఈ దాగి ఉన్న గనులు దేశ ఆర్థిక వ్యవస్థకు సరికొత్త ఊపునివ్వగలవు. అప్పుడు భారత్ బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశంలా కాకుండా బంగారాన్ని ఉత్పత్తి చేసే దేశంగా ఎదుగుతుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+