జియోతో టెలికాం రంగాన్ని మార్చేసిన రిలయన్స్, ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ రంగంలో కూడా అదే తరహా విప్లవానికి సిద్ధమవుతోంది. టెలికాం రంగంలో తక్కువ ధరలతో డేటా యుగాన్ని ప్రారంభించినట్టే, ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ 1 గిగావాట్ సోలార్ మాడ్యూల్ ఫ్యాక్టరీతో పునర్వినియోగ విద్యుత్ రంగాన్ని మార్చే లక్ష్యంతో ముందుకు వచ్చింది. ఇది 720 WP సామర్థ్యం గల BIS సర్టిఫైడ్ హెటీరోజంక్షన్ (HJT) సోలార్ ప్యానెల్స్ను తయారు చేయగలదు. ఈ ఫ్యాక్టరీ ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ లో భాగంగా, సుమారు రూ. 75,000 కోట్లు పెట్టుబడితో నిర్మించబడుతోంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ 2025లో జామ్నగర్, గుజరాత్లో సోలార్ ఫోటోవోల్టాయిక్ (PV) మాడ్యూల్ ఉత్పత్తిని ప్రారంభిస్తోంది. ఈ ప్రణాళికలో మొదటి 10 GW సామర్థ్యం కలిగిన లైన్ ఇప్పటికి జారీ అయింది, 2025 చివరలో 20 GW వరకు సామర్థ్యాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫ్యాక్టరీతో పాటు, రిలయన్స్ తన బ్యాటరీ తయారీ ప్లాంట్ సామర్థ్యాన్ని కూడా 30 GW/సంవత్సరానికి విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ నువామా పేర్కొన్నట్టు, సోలార్ రంగంలో రిలయన్స్ పెట్టుబడులు భారతీయ విద్యుత్ రంగాన్ని డిజిటలైజేషన్, చౌక ధరతో సరఫరా మార్చే దిశగా ఉన్నాయి. ఈ బ్రోకరేజ్ సంస్థ, రిలయన్స్ షేరుల ధరను రూ. 1,801గా నిర్ణయించింది. గత మూడేళ్లలో కంపెనీ పెట్టుబడులు, కొత్త రంగాల్లో విస్తరణ, అలాగే వాటికి లభించిన స్థిర వృద్ధి ఈ అంచనాల వెనుక ప్రధాన కారణాలు.
2016లో జియో టెలికాం ప్రవేశంతో భారతదేశంలో డేటా, ఇంటర్నెట్ మార్కెట్ మారిపోయింది. ఇప్పుడు, సోలార్ ఎనర్జీలో రిలయన్స్ ప్రవేశం కూడా అలాంటి విప్లవాన్ని సృష్టించవచ్చు. సోలార్ ప్యానెల్స్, బ్యాటరీలు, హైడ్రోజన్ ఎక్విప్మెంట్ వంటి వాటిని భారతదేశంలోనే తయారు చేసేందుకు రిలయన్స్ ప్రయత్నిస్తోంది.
రిలయన్స్ వంటి పెద్ద కంపెనీలు సోలార్ (సౌర) ప్రాజెక్ట్లను ప్రారంభించడం వల్ల భారతదేశం స్వయం ఆధారిత శక్తి విధానం (Self-reliant Energy Policy) కు దగ్గరవుతుంది. సోలార్ ప్యానెల్స్, బ్యాటరీలు, హైడ్రోజన్ ఉత్పత్తి సామగ్రి అన్నీ భారతదేశంలోనే తయారు చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇది సోలార్ ఏగుమతుల పై ఆధారపడటం తగ్గిస్తుంది. రిలయన్స్ చేపట్టిన ఈ ప్రాజెక్టు $10 బిలియన్ పెట్టుబడితో దేశీ స్థాయిలో మాన్యుఫ్యాక్చరింగ్, ఇన్వెస్ట్మెంట్, టెక్నాలజీ వినియోగాన్ని పెంచుతాయి. ఇది GDP వృద్ధికి దోహదపడే అంశం. సౌర శక్తి ఉత్పత్తి చేసేటప్పుడు కార్బన్ ఎమిషన్లు తక్కువగా ఉంటాయి. ఇది పర్యావరణానికి మేలు చేస్తుంది. అదేవిధంగా, ఇది వేలాది ఉద్యోగాలను కూడా సృష్టిస్తుంది.
రిలయన్స్ సోలార్ ప్రాజెక్టులు పెట్టుబడిదారులకు లాభాలు, దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి పోశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ తీసుకున్న కొత్త ఎనర్జీ ప్రాజెక్టులు కంపెనీ షేర్ ధరలపై ప్రభావాన్ని చూపించాయి. 2025 మే నాటికి రిలయన్స్ షేర్ ధర రూ. 1,421కి చేరుకుంది, ఇది గత ఆరు నెలల్లో దాదాపు 9.67 శాతం పెరిగింది. ఈ వృద్ధికి ప్రధాన కారణం కంపెనీ భారీ స్థాయిలో సోలార్, బ్యాటరీ, గ్రీన్ హైడ్రోజన్ తయారీ రంగాల్లో చేసిన పెట్టుబడులే.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications