ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల జరిగిన ఇన్వెస్టోపియా సమ్మిట్లో రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధిపై తన దృష్టిని సూటిగా వివరించారు. టెక్నాలజీ, కొత్త ఆవిష్కరణలు, పరిశోధన, పెట్టుబడులు వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్ను నంబర్ వన్గా చేయాలని తన దృఢ సంకల్పాన్ని చెప్పారు.

విజయవాడలో జరిగిన ఇన్వెస్టోపియా సమ్మిట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం చాలా ఆత్మవిశ్వాసంతో, స్పష్టమైన దిశతో ఉన్నాయి. ఈ సదస్సులో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు గురించిన తన ఆలోచనలను పూర్తిగా వివరించారు. అయన మాట్లాడుతూ "ఒకటి మాత్రమే కాదు, మీరు చెప్పిన ఏ రంగంలో అయినా, మేము నెంబర్ వన్ అవుతామంటున్నాను. డ్రోన్లు, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ ఇవన్నీ భవిష్యత్తు టెక్నాలజీలు మా దృష్టిలో ఉన్నాయి.
అంటే, ఒక్క రంగంలోనే కాకుండా అన్ని కీలక రంగాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకెళ్లాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా భవిష్యత్తులో కీలక పాత్ర పోషించే టెక్నాలజీలు లాంటి డ్రోన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ తయారీ, అంతరిక్ష పరిశోధన (ఏరోస్పేస్) వీటన్నిటి మీద రాష్ట్రం ప్రత్యేక దృష్టి పెట్టబోతుందని చెప్పారు.
ఈ టెక్నాలజీలు భారతదేశ అభివృద్ధికి కీలకం అవుతాయని, అవి ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమలు, పరిశోధనలకు అవకాశం కల్పిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన మాటల్లో మానకీ స్పష్టంగా తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ను టెక్నాలజీలో ముందంజలో ఉండే రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఆయన గట్టి ప్రణాళికలతో ఉన్నారు.
ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగానికి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్ టెక్నాలజీలలో ఇది కీలకమైనదిగా పేర్కొంటూ, రాష్ట్ర అభివృద్ధికి ఇది బలమైన ఆధారంగా నిలుస్తుందన్నారు. ఆయన తన పాలన ఎప్పుడూ పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటుందంటూ, రాష్ట్రానికి పెట్టుబడులు రావడానికి కావలసిన అనుకూల వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఉందన్నారు. పేదరికాన్ని తగ్గించి, సంపదను సృష్టించడం ద్వారా ప్రతి ఒక్కరికి మంచి జీవనం కల్పించడమే తన అభిప్రాయమన్నారు.
ఆయన ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులు పెట్టడానికి అత్యుత్తమ స్థలమని చెప్పారు. రాష్ట్రంలో అవసరమైన ప్రాథమిక సదుపాయాలు ఇప్పటికే అందుబాటులో ఉండడం, 1,000 కిలోమీటర్లకుపైగా విస్తరించిన తీరప్రాంతం ఉండటం వంటి అంశాలు పెట్టుబడులకు అనుకూలంగా ఉంటాయని వివరించారు. వ్యవసాయం, హార్టికల్చర్, ఇరిగేషన్, పంటలలో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ప్రథమ స్థానంలో ఉందని, అదే విధంగా టెక్నాలజీ, డిజిటల్ రంగం, మానవ వనరుల పరంగా కూడా రాష్ట్రం బలంగా ఉందని చెప్పారు. పర్యావరణానికి అనుకూలమైన గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో కూడా ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించబోతోందని, 2030 నాటికి కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో ఒక్క ఆంధ్రప్రదేశ్దే 160 గిగావాట్లు ఉత్పత్తి చేయాలన్న లక్ష్యం ఉందని ఆయన తెలిపారు.
ఆయన తన ప్రసంగంలో అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీని ప్రకటించినట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టుతో సహజసిద్ధంగా, పర్యావరణానికి హానీ చేయని శక్తిని తయారు చేయవచ్చని ఆయన చెప్పారు. అలాగే, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేసి, భారత్కు ఒక కొత్త టెక్నాలజీ కేంద్రంగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. మరోవైపు, విశాఖపట్నంలో గూగుల్ సంస్థ తన అతిపెద్ద డేటా సెంటర్ను నిర్మించబోతుందనడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ను టెక్నాలజీ, పరిశ్రమల రంగాల్లో ముందుకు తీసుకెళ్లే కీలక అడుగులుగా పేర్కొన్నారు.
చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్కు వచ్చే పెట్టుబడిదారుల ప్రతి ప్రయత్నం విజయవంతం కావాలనే దిశగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని హామీ ఇచ్చారు. వాళ్లకు అవసరమైన అన్ని రకాల మద్దతు, సౌకర్యాలు అందించేందుకు తాము కృషి చేస్తామని చెప్పారు.
విశ్వాసాన్ని ఒక్క రాత్రిలోనే పొందలేము, ఇది కాలక్రమంలో ఏర్పడే విషయం. అందుకే పెట్టుబడిదారుల నమ్మకాన్ని గెలుచుకునేందుకు ప్రభుత్వంగా మేము తాము నిరంతరం శ్రమిస్తామని స్పష్టం చేశారు.
More From GoodReturns

పెంటగాన్ డీల్ ఎఫెక్ట్.. ChatGPT ని వదిలేస్తున్న మిలియన్ల మంది యూజర్లు! అసలేం జరిగింది?

Population policy: పిల్లల పెంపకానికి నెలకు వెయ్యి రూపాయలు.. ఉచిత విద్య! ఎవరికి వర్తిస్తుందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications