కక్షకట్టిన కట్టిన స్టాక్ మార్కెట్.. ఎవ్వరిని వదిలిపెట్టలేదు.. లక్షల కోట్లు పోగొట్టుకున్న టాప్ 7 సంపన్నులు..

గత కొన్ని వారాలుగా స్టాక్ మార్కట్ల పతనం ఊహించని స్థాయికి పడిపోయి ఇన్వెస్టర్లకు కన్నీళ్లు తెప్పించాయి. అలాగే తక్కువ కాలంలోనే సెన్సెక్స్ నిఫ్టీ అత్యల్ప స్థాయిని తాకాయి. దీనికి తోడు బంగారం ధర రోజుకి రోజుకి పెరుగుతూ ఆల్ టైం హై రికార్డ్ సృష్టించాయి. నేడు కూడా బంగారం ధర భారీగా పెరిగి కస్టమర్లకు షాకిచ్చాయి. అయితే పెళ్లిళ్ల సీజన్లో ధరలు తగ్గుతాయని భావించిన కస్టమర్లకు మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఇక ఈ సంవత్సరం మొదటి నుండే భారత స్టాక్ మార్కెట్లు నిరంతర క్షీణతలో ట్రేడవుతున్నాయి. దింతో పెద్ద సంఖ్యలో షేర్లు అమ్ముడవుతున్నాయి. ఇంకా షేర్ల ధర క్రమంగా తగ్గుతోంది. ఈ కారణంగా పెట్టుబడిదారులు భారీగా నష్టాలను ఎదుర్కొంటున్నారు. స్టాక్ మార్కెట్ పతనం పెట్టుబడిదారులను మాత్రమే కాకుండా దేశంలోని మెగా-మిలియనీర్లను కూడా ప్రభావితం చేస్తోంది.

from adani to ambani these Indian Billionaires Lose 34 Billion Amid Stock Market Selloff

ఈ ఏడాది స్టాక్ మార్కెట్ పతనం కారణంగా అత్యంత ధనవంతులు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ అండ్ అజీమ్ ప్రేమ్‌జీతో సహా టాప్ 7 బడా-సంపన్నులు దాదాపు 70 రోజుల్లో మొత్తం రూ.2.95 లక్షల కోట్లు ($34 బిలియన్లు) కోల్పోయారు. ఈ బడా-బిలియనీర్ల మొత్తం ఆస్తులు 300 బిలియన్ డాలర్లను మించిపోవడం గమనార్హం. టాప్ 7 బడా సంపన్నులలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ స్టాక్ మార్కెట్ పతనం వల్ల ఎక్కువగా ప్రభావితమైయ్యారు. ఈ సంవత్సరం అదానీ నికర విలువ $10.1 బిలియన్లు తగ్గింది. దీని తరువాత అతని నికర విలువ $68.8 బిలియన్లకు పడిపోయింది. అదానీ గ్రూప్ కంపెనీలలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు ధర 12 శాతం తగ్గింది.
ఇంకా, అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్ ధర 22 శాతం, అదానీ టోటల్ గ్యాస్ షేర్ ధర 21.26 శాతం తగ్గాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ సహా అదానీ పోర్ట్స్ 6 నుండి 3 శాతం పడిపోయాయి.

ఇక ఏడాది స్టాక్ మార్కెట్ పతనం వల్ల రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ 3.13 బిలియన్ డాలర్లు నష్టపోయారు. అయినకూడా అతను భారతదేశపు బడా-ధనవంతుల లిస్టులో టాప్ లో కొనసాగుతున్నాడు. ఆయన నికర ఆస్తుల విలువ 87.5 బిలియన్ డాలర్లు. స్టాక్ మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర 2.54 శాతం పెరిగింది. మరోవైపు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్ ధర 28.7 శాతం పడిపోయింది.

అంతేకాదు HCL టెక్నాలజీస్ చైర్మన్ శివ్ నాడార్ నికర విలువ 7.13 బిలియన్ డాలర్లు తగ్గింది. అతని ప్రస్తుత నికర విలువ $36 బిలియన్లు. ఈ ఏడాది ఇప్పటివరకు విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ నికర విలువ 2.7 బిలియన్ డాలర్లు పడిపోయింది. ప్రస్తుతానికి, అతని నికర విలువ $28.2 బిలియన్లు. ఇంజనీరింగ్ అండ్ నిర్మాణ సంస్థ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ వెనుక ఉన్న వ్యక్తి షాపూర్ మిస్త్రీ నికర విలువ $4.53 బిలియన్లు తగ్గింది. ఆయన ప్రస్తుత నికర ఆస్తుల విలువ $34.1 బిలియన్లు. OP జిందాల్ గ్రూప్ ఎమెరిటస్ చైర్‌పర్సన్ సావిత్రి జిందాల్ కూడా $2.22 బిలియన్లను కోల్పోయారు. ఆమె ప్రస్తుత నికర ఆస్తుల విలువ $30.1 బిలియన్లు. సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ చైర్మన్ దిలీప్ సంఘ్వీ నికర విలువ 4.21 బిలియన్ డాలర్లు తగ్గింది. ఆయన ప్రస్తుత నికర ఆస్తుల విలువ $25.3 బిలియన్లు.

Take a Poll

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+