భారతదేశం ఐటీ సేవల ఎగుమతికి ఫేమస్ కావటంతో ఈ రంగంలో భారీ ఉపాధిగా అవకాశాలు పెరిగాయి. జాబ్ వచ్చినా రాకున్నా ఒకప్పుడు కంప్యూటర్ సైన్స్ చాలా మంది చేసేవారు. కానీ నేటి యువత చాలా తెలివిగా ముందుకు సాగుతోంది.
ముఖ్యంగా దేశంలోని చిన్న పట్టణాలు, నగరాల్లో యువ ఇంజనీర్లు తమ నైపుణ్యాలను పెంచుకుంటున్నారు. ట్రెండ్ కి అనుగుణంగా అధిక డిమాండ్ ఉన్న సాంకేతికతలైన జనరేటివ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఫుల్ స్టాక్, ఈవీ డిజైన్ వంటి వాటిపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యమంగా ఒకప్పుడు నగరాల్లోని యువత ఇలా ఉండేవారు.. అయితే ప్రస్తుతం ఈ కల్చర్ చిన్న పట్టణాలకు సైతం విస్తరించింది. మార్కెట్లకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకునేందుకు యువ గ్రాడ్యుయేట్లు రూ.1-4 లక్షలు వెచ్చిస్తున్నారు.

అత్యంత పోటీతో కూడిన జాబ్ మార్కెట్లో మంచి జీతాలను అందించే డిమాండ్ ఉన్న టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవాలని చాలా మంది యువత ఆసక్తి చూపుతున్నట్లు తేలింది. ఈ క్రమంలో మధురై, నాగ్పూర్, విశాఖపట్నం, కోయంబత్తూర్, లక్నో, ఇండోర్, తిరుచిరాపల్లి, మైసూర్, కొత్తత్తూరు, భువనేశ్వర్ వంటి చిన్న పట్టణాల్లో యువత ఎక్కువగా ఇటువైపు మెుగ్గుచుపుతున్నట్లు డేటా వెల్లడించింది. ఈ నగరాల నుంచి నమోదు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య 40 శాతానికి పైగా ఉన్నట్లు గణాంకాలు తేటతెల్లం చేశాయి.
ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫారమ్ అప్గ్రాడ్ మునుపటి త్రైమాసికంతో పోలిస్తే రెండవ త్రైమాసికంలో నాన్-మెట్రో స్థానాల నుంచి వచ్చిన ఫ్రెషర్ క్వార్టర్లీ 50 శాతం పెరిగినట్లు వెల్లడించింది. ఇదిలా ఉన్నప్పటికీ వీరందరినీ తీసుకునేందుకు ఐటీ జాబ్ మార్కెట్ మాత్రం అస్సలు సిద్ధంగా లేదు. వాస్తవానికి దేశంలోని టాప్ టెక్ కంపెనీలు సైతం ఈ ఏడాది అనిశ్చిత వ్యాపార వాతావరణం కారణంగా క్యాంపస్ ప్లేస్మెంట్లను దాటవేయాలని నిర్ణయించుకున్నాయి. ఖర్చులను నియంత్రించడానికి వారి ఎంట్రీ-లెవల్ రిక్రూట్మెంట్లో ప్రధానంగా కోత విధించాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications