ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఆర్టిసి బస్సుల్లో మహిళల సందడే కనిపిస్తోంది. ఎన్నికల హామీలో భాగంగా తెలంగాణలో 'మహాలక్ష్మి', ఆంధ్రప్రదేశ్లో 'స్త్రీ శక్తి' పథకాల ద్వారా మహిళలకు ఉచిత బస్సు (Free bus) ప్రయాణ సదుపాయం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కేవలం మహిళలకేనా.. మా పరిస్థితి ఏంటి? అని ప్రశ్నిస్తున్న పురుషులకు ఇప్పుడు ప్రభుత్వాలు తీపి కబురు అందించాయి.

పురుషులకు కూడా ఉచిత ప్రయాణం!
అందరికీ కాకపోయినా సమాజంలో ప్రత్యేక చేయూత అవసరమైన దివ్యాంగులకు (Disabled) ఇకపై ఆర్టిసి బస్సుల్లో పూర్తి ఉచిత ప్రయాణం కల్పించాలని అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు యోచిస్తున్నాయి. దీనివల్ల వేలాది మంది దివ్యాంగులైన పురుషులకు భారీ ఊరట కలగనుంది.
ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల కీలక ప్రకటన చేశారు. దివ్యాంగులను కూడా ఉచిత బస్సు (Free bus) పథకంలో భాగస్వామ్యం చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం దివ్యాంగులకు టికెట్ ధరలో 50% రాయితీ (Half Fare) ఉంది. త్వరలో మహిళల తరహాలోనే 100% ఉచిత ప్రయాణం అమల్లోకి రానుంది. ఇప్పటికే దీనిపై అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. రాష్ట్రంలో ఎంతమంది దివ్యాంగులు ఉన్నారు? దీనివల్ల ప్రభుత్వంపై పడే అదనపు భారం ఎంత? అనే లెక్కలను సిద్ధం చేస్తున్నారు.
తెలంగాణలోనూ 'ఫ్రీ జర్నీ' దిశగా అడుగులు
తెలంగాణ ప్రభుత్వం కూడా దివ్యాంగులకు ఊరటనిచ్చేందుకు సిద్ధమైంది. దీనిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో ఇప్పటికే చర్చలు జరిగాయని, త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి అధికారిక ప్రకటన వెలువరిస్తామని తెలిపారు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే తెలంగాణలో కూడా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి వస్తుంది.
దేశవ్యాప్తంగా ఉచిత బస్సు పథకాలు
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ విజయవంతంగా నడుస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో 'శక్తి' పథకం ద్వారా మహిళలకు ఉచితంగా బస్సు సేవలు అందిస్తున్నారు. తమిళనాడులో 'మగిలిర్ విడియల్ పయనం థిట్టం' పేరుతో సాధారణ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ. అలాగే ఢిల్లీ & పంజాబ్ లో కూడా పరిమిత బస్సుల్లో మహిళలకు ఉచిత సదుపాయం ఉంది. మరిన్ని రాష్ట్రాలు కూడా ఈ పథకాన్ని అమలు చేసే ప్లాన్ లో ఉన్నాయి.
దివ్యాంగుల హర్షం
ప్రస్తుతం అరకొర రాయితీలతో ఇబ్బంది పడుతున్నామని, పూర్తి ఉచితం చేస్తే తమ ఆర్థిక భారం తగ్గుతుందని దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జాప్యం చేయకుండా వెంటనే జీవో జారీ చేయాలని వారు కోరుతున్నారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, ఆర్టిసి బస్సుల్లో మహిళలతో పాటు దివ్యాంగులైన పురుషులు కూడా నిర్భయంగా, ఖర్చు లేకుండా ప్రయాణించవచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications