PNB Bank Fraud: పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాస్తవానికి ఒక ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ. గతంలో నీరవ్ మోడీ అనే వ్యాపారవేత్తకి సంబంధించిన స్కామ్ 2018 ఆగస్టులో బయటపడింది. ఆ సమయంలో బ్యాంకుకు నకిలీ లెటర్ ఆఫ్ క్రెడిట్స్ బ్యాంకుకు సమర్పించినట్లు తేలింది. దీని వల్ల బ్యాంకుకు దాదాపు రూ.13,760 కోట్ల నష్టం వాటిల్లిన్న సంగతి తెలసిందే. అయితే ప్రస్తుతం ఆయన భారతదేశం నుంచి వెళ్లిపోయి లండన్ లో నివసిస్తున్నారు.
దీని తర్వాత ప్రస్తుతం మరోసారి పంజాబ్ నేషనల్ బ్యాంకు పేరు మరోసారి వార్తా పత్రికల్లో ప్రధానంగా వినిపిస్తోంది. దీనికి కారణం ఒడిశాకు చెందిన గుప్తా పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ రూ.270.57 కోట్ల మేర మోసం చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ పీఎన్బీ నివేదించింది. కంపెనీకి చెందిన ఎన్పీఏ ఖాతాలో ఈ మోసం జరిగినట్లు బ్యాంక్ గుర్తించింది. ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లోని బ్యాంకు స్టేషన్ స్క్వేర్ బ్రాంచ్ కంపెనీకి ఈ భారీ రుణాన్ని అందించిందని తెలిపింది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ నికర లాభం మూడవ త్రైమాసికంలో రెండింతలు పెరిగి రూ.4,508 కోట్లకు చేరిన సంగతి తెలిసిందే. దీనికి ముందు గడచిన ఏడాది బ్యాంక్ ఇదే త్రైమాసికంలో దాదాపు రూ.2223 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అలాగే డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.29,962 కోట్లుగా ఉండగా.. వడ్డీ ఆదాయం రూ.31,340 కోట్లుగా నమోదైంది. అలాగే నిరర్థక ఆస్తుల సంఖ్య కూడా తగ్గుదలను నమోదు చేసింది.
నాలుగు రోజుల కిందట..
ఇదిలా ఉండగా చాలా కాలంగా కొనసాగుతున్న గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ యజమాని మెహుల్ చోక్సీ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లెటర్ ఆఫ్ క్రెడిట్స్ కుంభకోణంలో చోక్సీ ప్రధాన నిందితుడుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే మనీలాండరింగ్ చట్టం కింద ముంబై సూరత్ లోని అనేక ప్రాపర్టీలను వేలం ద్వారా విక్రయించటానికి కోర్టు అనుమతి ఇచ్చింది.
ఈ క్రమంలో ముంబైలోని శాంతాక్రూజ్లోని ఖేనీ టవర్లో 7 ఫ్లాట్లు, ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని భారత్ డైమండ్ బోర్స్లో 1 వాణిజ్య యూనిట్, సూరత్లోని డైమండ్ పార్క్లో 15 ఆఫీస్ స్పేస్లు, సూరత్లోని డైమండ్ పార్క్లో 1 రిటైల్ స్థలం ఇందులో ఉన్నాయి. అయితే ఎక్కువ ఆలస్యం చేయటం వల్ల సదరు ఆస్తులు మెయింటెనెన్స్ లో లేనందున వాటి ధర తగ్గే అవకాశం ఉందనే వాదనలో ఏకీభవించిన కోర్టు ఈ మేరకు తాజా రూలింగ్ ప్రకటించింది. దీంతో ఆస్తుల విక్రయం ద్వారా బ్యాంకుకు జరిగిన నష్టాన్ని రికవర్ చేసే ప్రక్రియ కొంత వేగవంతం అయ్యింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications