PM Modi in Paris: ఫ్రాన్స్‌లో ఇండియన్ యూపీఐ.. రూపాయిల్లో చెల్లింపులకు వీలు..

PM Modi in Paris: డిజిటల్ పేమెంట్స్ రంగంలో భారత్ సరికొత్త మైలురాయిని చేరుకుంది. యూరోపియన్ దేశంలో యూపీఐ చెల్లింపుల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ప్రధాని మోదీ ప్యారిస్ పర్యటన నేపథ్యంలో ఒప్పందం ఖరారైంది.

యూపీఐ చెల్లింపుల వ్యవస్థను అందుబాటులో ఉంచేందుకు భారత్-ఫ్రాన్స్ అంగీకరించాయి. ఈఫిల్ టవర్ పై నుంచి భారత ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారతీయ పర్యాటకులు త్వరలో UPI ఉపయోగించి రూపాయి చెల్లింపులు చేయగలుగుతారని పేర్కొన్నారు. దీనికోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI).. ఫ్రాన్స్ సురక్షిత ఆన్‌లైన్ చెల్లింపు వ్యవస్థ లైరాతో 2022లో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది.

modiparistour1

ఫ్రాన్స్‌తో ఒప్పందానికి ముందు భారత్ 2023లో సింగపూర్‌కు చెందిన PayNowతో ఒప్పందంపై సంతకం చేసింది. ఇరు దేశాల్లోని వినియోగదారులను సరిహద్దు లావాదేవీలు చేయడానికి వెసులుబాటు ఏర్పడింది. ఇదే క్రమంలో UAE, భూటాన్, నేపాల్ ఇప్పటికే UPI వ్యవస్థను అంగీకరించాయి. తాజాగా.. NPCI యూరప్, పశ్చిమాసియా, USలోని అనేక ఇతర దేశాల్లో UPI సేవలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఫ్రాన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చదివే విద్యార్థులకు దీర్ఘకాలిక ఐదేళ్ల వీసాలు మంజూరు చేయాలని ఫ్రాన్స్ నిర్ణయించినట్లు ప్రధాని మోదీ ధృవీకరించారు. దేశంలో పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు పెట్టాల‌ని కోరారు. దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే అత్యంత అనువైన సమయమని, ముందుగా పెట్టుబడులు పెట్టే వారు లాభాలను పొందుతారని అన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+