Layoffs: ఎంఎస్ ధోని పెట్టుబడి పెట్టిన కంపెనీలో ఉద్యోగుల తొలగింపు..
భారత్ లో గతేడాది నుంచి లే ఆఫ్ లు కొనసాగుతోన్నాయి. అనేక రంగాలలోని కంపెనీలు నిరంతరం తొలగింపులు చేయవలసి వస్తుంది. తాజాగా మరో ఫిన్టెక్ స్టార్టప్ కంపెనీ ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఇది కూడా సాధారణ ఫిన్టెక్ కంపెనీ కాదు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఇందులో పెట్టుబడి పెట్టిన కంపెనీ. బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఖాతాబుక్ ఫిన్ టెక్ కంపెనీ లే ఆఫ్ లు ప్రకటించింది. ఈ వారంలో కంపెనీ తాజా రౌండ్లలో చాలా మంది ఉద్యోగులను తొలగించింది.
ఈ కంపెనీ ఇంజనీరింగ్, ఉత్పత్తి, మార్కెటింగ్ బృందాల ఉద్యోగులు తొలగించినట్లు తెలుస్తోంది. ఖతాబుక్ కూడా తొలగించబడిన ఉద్యోగులకు కొంత ఉపశమనం కలిగించడానికి ప్రయత్నించింది. తొలగించిన ఉద్యోగులకు కంపెనీ మూడు నెలల జీతాన్ని ఇచ్చింది. అంతే కాకుండా బీమాపై కూడా కంపెనీ పొడిగింపు ఇచ్చింది. ఫిన్టెక్ కంపెనీ ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోందని సంబంధిత వ్యక్తులు చెబుతున్నారు. అందుకే తొలగింపులు చేపట్టినట్లు తెలుస్తోంది.

ఖాతాబుక్ దాని లాభాల లక్ష్యాన్ని సాధించడానికి తన వ్యాపారంలోని భాగాలను రీకాలిబ్రేట్ చేస్తోందని పేరు చెప్పడనికి ఇష్టపడని కంపెనీ అధికారి చెప్పారు. సంస్థ పునర్నిర్మాణ ప్రయత్నాల్లో భాగంగా మొత్తం ఉద్యోగుల్లో 6 శాతం మందిని తొలగిస్తున్నారు. రిలీవ్మెంట్ వల్ల నష్టపోయిన ఉద్యోగులందరికీ రిలీఫ్ ప్యాకేజీ ఇస్తున్నారు. ఖాతాబుక్ అనేది ఫిన్టెక్ స్టార్టప్ కంపెనీ, ఇది యాప్ ద్వారా ఖాతాలను రుణాలు ఇవ్వడం చేస్తుంది. ఈ కంపెనీని వైభవ్ కల్పే స్థాపించారు. తర్వాత 2018లో కైట్ టెక్నాలజీస్ ఖతాబుక్ను కొనుగోలు చేసింది.
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఖాతాబుక్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఎంఎస్ ధోనీ కూడా ఇందులో పెట్టుబడి పెట్టాడని ఖాతాబుక్ పేర్కొంది. అయితే, పెట్టుబడి ఎంత అనేది ఎప్పుడూ స్పష్టంగా చెప్పలేదు. ఆగస్ట్ 2021లో జరిగిన ఫండింగ్ రౌండ్లో దీని విలువ $600 మిలియన్లుగా అంచనా వేశారు. ఆ తర్వాత సిరీస్ సి ఫండింగ్ రౌండ్లో $ 100 మిలియన్లను సేకరించడంలో కంపెనీ విజయవంతమైంది. ట్రైబ్ క్యాపిటల్, మూర్ స్ట్రాటజిక్ వెంచర్స్, ఆల్కియోన్ క్యాపిటల్, సీక్వోయా క్యాపిటల్, టెన్సెంట్, ఆర్టిపి వెంచర్స్, యూనిలివర్ వెంచర్స్, బెటర్ క్యాపిటల్ వంటి పెట్టుబడిదారుల నుంచి సిరీస్ సి రౌండ్ నిధులు పొందింది.


Click it and Unblock the Notifications