ఫోర్డ్ మోటార్ కంపెనీ భారతదేశంలో మళ్లీ తన ఉనికిని బలపరచుకునే దిశగా కీలకమైన అడుగు వేసింది. కంపెనీ చెన్నైలోని తన తయారీ యూనిట్లో రూ.3,250 కోట్లు పెట్టుబడి పెట్టి తదుపరి తరం ఇంజిన్ల ఉత్పత్తిని ప్రారంభించనుంది. 2029 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనుందని కంపెనీ ప్రకటించింది. ఇది ఫోర్డ్ యొక్క ప్రపంచవ్యాప్తంగా రూపొందించిన Ford వ్యూహాత్మక ప్రణాళికలో భాగం, ఇందులో భవిష్యత్ పవర్ట్రెయిన్ (Powertrain) సాంకేతికతల కోసం భారతదేశం వంటి ఉత్పత్తి కేంద్రాలను ఉపయోగించుకోవడం ప్రధాన ఉద్దేశ్యం అని చెప్పవచ్చు.
ఈ పెట్టుబడి ఫోర్డ్, తమిళనాడు ప్రభుత్వాల మధ్య ఇటీవల కుదిరిన MoU (Memorandum of Understanding) ద్వారా సాధ్యమైంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 600కు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు, అలాగే సరఫరా గొలుసులో వేలాది పరోక్ష ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని అంచనా. కొత్త ఇంజిన్ తయారీ యూనిట్ సంవత్సరానికి 2.35 లక్షల ఇంజిన్ల ఉత్పత్తి సామర్థ్యాన్నికలిగి ఉండనుంది.

ఫోర్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్ల గ్రూప్ అధ్యక్షుడు జెఫ్ మారెంటిక్ మాట్లాడుతూ.. చెన్నై ప్లాంట్ ఫోర్డ్ గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ నెట్వర్క్లో కీలక భాగంగా మారనుంది. తమిళనాడు ప్రభుత్వం అందిస్తున్న నిరంతర సహకారం మరియు రాష్ట్రం కలిగి ఉన్న బలమైన పారిశ్రామిక మౌలిక సదుపాయాలు ఈ ప్రాజెక్ట్ విజయానికి మద్దతు ఇస్తాయని అన్నారు. ఈ నిర్ణయం ఫోర్డ్ భారతదేశ తయారీ శక్తిని అంతర్జాతీయ స్థాయిలో ఉపయోగించుకోవాలనే దీర్ఘకాలిక నిబద్ధతను ప్రతిబింబిస్తోందని తెలిపారు.
తమిళనాడు పరిశ్రమల మంత్రి డాక్టర్ టి.ఆర్.బి రాజా మాట్లాడుతూ.. ఫోర్డ్ మళ్లీ చెన్నైలో ఉత్పత్తిని ప్రారంభించడం రాష్ట్రానికి గర్వకారణం. ఇది ఎంకే స్టాలిన్ ప్రభుత్వం తీసుకున్న పారిశ్రామిక అభివృద్ధి చర్యల ఫలితమని అన్నారు. ఇది కేవలం ఫోర్డ్ పునరాగమనం మాత్రమే కాదు, తమిళనాడును భవిష్యత్తు ఆటోమొబైల్ ఉత్పత్తి కేంద్రంగా నిలబెట్టే మరో అడుగుగా ఆయన అభివర్ణించారు.
ఫోర్డ్ చెన్నై ప్లాంట్ ఇప్పటికే బలమైన మౌలిక సదుపాయాలతో ఉంది. గతంలో ఈ ప్లాంట్ సంవత్సరానికి 2 లక్షల వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉండగా, గుజరాత్లోని సనంద్ ప్లాంట్ 2.4 లక్షల వాహనాలు, 2.7 లక్షల ఇంజిన్లను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే 2021లో, వరుస ఆర్థిక నష్టాలు.. దాదాపు USD 2 బిలియన్ ఆపరేటింగ్ నష్టం, USD 0.8 బిలియన్ ఆస్తి రైట్డౌన్ తో ఫోర్డ్ను భారతదేశంలో వాహన తయారీని నిలిపివేయడానికి దారితీశాయి.
అయితే ఇప్పుడు చెన్నై ప్లాంట్ పునరుద్ధరణతో ఫోర్డ్ మళ్లీ ఆటోమోటివ్ రంగంలో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ ఇప్పటికే తమిళనాడులోని గ్లోబల్ బిజినెస్ ఆపరేషన్స్ యూనిట్లో 12,000 మంది ఉద్యోగులను కొనసాగిస్తోంది. ప్రస్తుత కస్టమర్లకు సేవలు, విడిభాగాల సరఫరా, వారంటీ మద్దతు అందిస్తోంది. తాజా ప్రణాళిక ప్రకారం, కొత్తగా అభివృద్ధి చేస్తున్న ఇంజిన్లు పూర్తిగా ఆధునిక సాంకేతికతను కలిగి ఉంటాయి. ఈ ఇంజిన్లు దేశీయ మార్కెట్తో పాటు ఎగుమతులకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications