ఫోర్డ్ మోటార్ కంపెనీ భారతదేశంలో మళ్లీ తన ఉనికిని బలపరచుకునే దిశగా కీలకమైన అడుగు వేసింది. కంపెనీ చెన్నైలోని తన తయారీ యూనిట్లో రూ.3,250 కోట్లు పెట్టుబడి పెట్టి తదుపరి తరం ఇంజిన్ల ఉత్పత్తిని ప్రారంభించనుంది. 2029 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనుందని కంపెనీ ప్రకటించింది. ఇది ఫోర్డ్ యొక్క ప్రపంచవ్యాప్తంగా రూపొందించిన Ford వ్యూహాత్మక ప్రణాళికలో భాగం, ఇందులో భవిష్యత్ పవర్ట్రెయిన్ (Powertrain) సాంకేతికతల కోసం భారతదేశం వంటి ఉత్పత్తి కేంద్రాలను ఉపయోగించుకోవడం ప్రధాన ఉద్దేశ్యం అని చెప్పవచ్చు.
ఈ పెట్టుబడి ఫోర్డ్, తమిళనాడు ప్రభుత్వాల మధ్య ఇటీవల కుదిరిన MoU (Memorandum of Understanding) ద్వారా సాధ్యమైంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 600కు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు, అలాగే సరఫరా గొలుసులో వేలాది పరోక్ష ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని అంచనా. కొత్త ఇంజిన్ తయారీ యూనిట్ సంవత్సరానికి 2.35 లక్షల ఇంజిన్ల ఉత్పత్తి సామర్థ్యాన్నికలిగి ఉండనుంది.

ఫోర్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్ల గ్రూప్ అధ్యక్షుడు జెఫ్ మారెంటిక్ మాట్లాడుతూ.. చెన్నై ప్లాంట్ ఫోర్డ్ గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ నెట్వర్క్లో కీలక భాగంగా మారనుంది. తమిళనాడు ప్రభుత్వం అందిస్తున్న నిరంతర సహకారం మరియు రాష్ట్రం కలిగి ఉన్న బలమైన పారిశ్రామిక మౌలిక సదుపాయాలు ఈ ప్రాజెక్ట్ విజయానికి మద్దతు ఇస్తాయని అన్నారు. ఈ నిర్ణయం ఫోర్డ్ భారతదేశ తయారీ శక్తిని అంతర్జాతీయ స్థాయిలో ఉపయోగించుకోవాలనే దీర్ఘకాలిక నిబద్ధతను ప్రతిబింబిస్తోందని తెలిపారు.
తమిళనాడు పరిశ్రమల మంత్రి డాక్టర్ టి.ఆర్.బి రాజా మాట్లాడుతూ.. ఫోర్డ్ మళ్లీ చెన్నైలో ఉత్పత్తిని ప్రారంభించడం రాష్ట్రానికి గర్వకారణం. ఇది ఎంకే స్టాలిన్ ప్రభుత్వం తీసుకున్న పారిశ్రామిక అభివృద్ధి చర్యల ఫలితమని అన్నారు. ఇది కేవలం ఫోర్డ్ పునరాగమనం మాత్రమే కాదు, తమిళనాడును భవిష్యత్తు ఆటోమొబైల్ ఉత్పత్తి కేంద్రంగా నిలబెట్టే మరో అడుగుగా ఆయన అభివర్ణించారు.
ఫోర్డ్ చెన్నై ప్లాంట్ ఇప్పటికే బలమైన మౌలిక సదుపాయాలతో ఉంది. గతంలో ఈ ప్లాంట్ సంవత్సరానికి 2 లక్షల వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉండగా, గుజరాత్లోని సనంద్ ప్లాంట్ 2.4 లక్షల వాహనాలు, 2.7 లక్షల ఇంజిన్లను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే 2021లో, వరుస ఆర్థిక నష్టాలు.. దాదాపు USD 2 బిలియన్ ఆపరేటింగ్ నష్టం, USD 0.8 బిలియన్ ఆస్తి రైట్డౌన్ తో ఫోర్డ్ను భారతదేశంలో వాహన తయారీని నిలిపివేయడానికి దారితీశాయి.
అయితే ఇప్పుడు చెన్నై ప్లాంట్ పునరుద్ధరణతో ఫోర్డ్ మళ్లీ ఆటోమోటివ్ రంగంలో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ ఇప్పటికే తమిళనాడులోని గ్లోబల్ బిజినెస్ ఆపరేషన్స్ యూనిట్లో 12,000 మంది ఉద్యోగులను కొనసాగిస్తోంది. ప్రస్తుత కస్టమర్లకు సేవలు, విడిభాగాల సరఫరా, వారంటీ మద్దతు అందిస్తోంది. తాజా ప్రణాళిక ప్రకారం, కొత్తగా అభివృద్ధి చేస్తున్న ఇంజిన్లు పూర్తిగా ఆధునిక సాంకేతికతను కలిగి ఉంటాయి. ఈ ఇంజిన్లు దేశీయ మార్కెట్తో పాటు ఎగుమతులకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications