Pureit: దేశంలోని ఎఫ్ఎంసీజీ రంగంలోని దిగ్గజ సంస్థ హిందుస్థాన్ యూనీలివర్ తాజాగా తన వ్యాపారాన్ని విక్రయించింది. కంపెనీ తన వాటర్ ప్యూరిఫయర్ల వ్యాపారాన్ని తాజాగా విక్రయించింది.
హిందుస్థాన్ యూనీలివర్ సంస్థ Pureit పేరుతో భారతదేశంలో నిర్వహిస్తున్న వాటర్ ప్యూరిఫయర్ల వ్యాపారాన్ని 72 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీ లెక్కల ప్రకారం దాదాపు రూ.601 కోట్లకు విక్రయించింది. ఈ వ్యాపారాన్ని ఏఓ స్మిత్ ఇండియాకు అమ్మేసింది. అయితే ఈ డీల్ పూ్ర్తి కావటానికి దాదాపు 3 నెలల సమయం పడుతుందని కంపెనీ వెల్లడించింది. తాము కోర్ వ్యాపారాలపై దృష్టి పెట్టినందున దేశంలో లక్షలాధిమందికి శుద్ధమైన నీటిని అందించే వ్యాపారాన్ని విక్రయించాలని నిర్ణయించినట్లు సీఈవో, ఎండీ రోహిత్ జావా పేర్కొన్నారు.

గతంలోనే హిందుస్థాన్ యూనీలివర్ కంపెనీ తన వాటర్ ప్యూరిఫికేషన్ వ్యాపార విక్రయానికి సంబంధించిన చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుత డీల్ దీనిని నిజమని తేల్చింది. ప్యూరిట్ దేశంలో భౌగోళిక ఉనికిని కలిగిఉన్న బలమైన బ్రాండ్గా పేరుగాంచిందని ఏఓ స్మిత్ ఇండియా ప్రెసిడెంట్ పరాగ్ కులకర్ణి పేర్కొన్నారు. వినియోగదారుల అవసరాలపై ప్యూరిట్ లోతైన అవగాహన కలిగి ఉందని, వారి వాటర్ ప్యూరిఫికేషన్ నైపుణ్యం దేశంలోని తమ కంపెనీకి అద్భుతమైన బలాన్ని అందిస్తుందని కులకర్ణి అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుత డీల్ స్లంప్ సేల్ బేల్ మీద జరిగిందని కంపెనీ వెల్లడించింది.
వాస్తవానికి హిందుస్థాన్ యూనీలివర్ మెుదటిసారిగా 2004న చెన్నైలో ప్యూరిట్ వ్యాపారాన్ని లాంచ్ చేసింది. కంపెనీ వ్యాపారాన్ని దేశవ్యాప్తంగా 2008లో విస్తరించింది. కంపెనీ 2011లో ఎలక్ట్రిక్ వాటర్ ప్యూరిఫికేషన్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ప్యూరిట్ వ్యాపారం రూ.293 కోట్లుగా నమోదైంది. ఇది మెుత్తం కంపెనీ వ్యాపారంలో 1 శాతం కంటే తక్కువని తెలుస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications