క్రిప్టో కరెన్సీపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు, శ్రీలంకకు సహాయంపై...

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన అమెరికా పర్యటనలో ఓ సెమినార్‌లో క్రిప్టో కరెన్సీపై కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిప్టోలను మనీ లాండరింగ్, ఉగ్రవాదులకు నిధులు సమీకరించేందుకు ఉపయోగించే ముప్పు పొంచి ఉందన్నారు. క్రిప్టోలతో అన్ని దేశాలకు ఉన్న అతిపెద్ద ముప్పు ఇదేనని, మనీలాండరింగ్, ఉగ్రవాదానికి ఆర్థిక సాయం అందించేందుకు ఈ కరెన్సీని ఉపయోగించే అవకాశాలు ఉన్నాయన్నారు.

ఈ సమస్య పరిష్కరించేందుకు టెక్నాలజీతో కూడిన నియంత్రణ అవసరమని భావిస్తున్నామని చెప్పారు. ఇది కేవలం ఏ ఒక్క దేశమో నిర్వహించడం అసాధ్యమని, బోర్డులోని అన్ని దేశాలు సమన్వయం చేసుకోవాలన్నారు. భారత్‌లో టెక్నాలజీ వినియోగం గురించి కూడా కేంద్రమంత్రి ప్రస్తావించారు.

FM Sitharaman warns of crypto misuse in terror financing

కరోనా సమయంలో భారత్‌లో టెక్నాలజీ వినియోగం భారీగా పెరిగిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రేటు 64 శాతంగా ఉందని తెలిపారు. భారత్‌లో మాత్రం టెక్నాలజీ వినియోగం 85 శాతానికి చేరుకుందన్నారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభం పైన కూడా ఆమె స్పందించారు. శ్రీలంకకు అన్ని విధాలుగా భారత్ నుండి సహకారం ఉంటుందని నిర్మలమ్మ చెప్పారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+