pre budget consultation: వారితో నిర్మలా సీతారామన్ భేటీ
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బీజేపీ నాయకులు, అలాగే ప్రొఫెషనల్స్, బిజినెస్ లీడర్స్, అలాగే పార్టీతో సంబంధం కలిగిన అకడమిషియన్స్, ఎకనమిస్ట్స్తో బడ్జెట్కు ముందు సంప్రదింపులు జరుపుతున్నారు. 25 బీజేపీ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులతో వర్చువల్ డిస్కషన్లో పాల్గొన్నారు. ఈ సంప్రదింపుల్లో నేషనల్ లీడర్లు, పార్టీ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్, వైస్ ప్రెసిడెంట్ బైజయంత్ పాండా, అధికార ప్రతినిధి గోపాల్ క్రిషన్ అగర్వాల్ తదితరులు ఉన్నారు.
ప్రముఖ థింక్-ట్యాంక్ మెంబర్స్, బీజేపీ వివిధ విభాగాలకు చెందిన అధ్యక్షులు తమ అభిప్రాయాలు, సూచనలు అందించారు. దాదాపు 20 రాతపూర్వక సమర్పణలు వచ్చాయని, వీటిని సంకలనం చేసి ఆర్థికమంత్రికి సమర్పిస్తామని అగర్వాల్ ఓ ప్రకటనలో తెలిపారు. సూచనల నేపథ్యంలో పార్టీ కార్యకర్తలకు నిర్మలా సీతారామన్ థ్యాంక్స్ తెలిపారు.
నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ను ప్రవేశ పెడుతున్నారు. కరోనా క్లిష్టపరిస్థితుల్లో ఆమె ప్రవేశపెడుతున్న రెండో బడ్జెట్ ఇది. 2020లో బడ్జెట్ సమర్పణ అనంతరం కొన్నాళ్లకు కరోనా వెలుగు చూసింది. అప్పటి నుండి భారత, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా పతనమైంది. ఆర్థిక రికవరీకి కేంద్రం అనేక చర్యలు తీసుకుంది. వ్యాక్సీనేషన్కు పూర్తిగా కేంద్రం భరిస్తుంది. ప్రజలకు ఉచిత వ్యాక్సినేషన్ ఇస్తోంది. అలాగే, కోట్లాదిమందికి ఉచిత రేషన్ ఇస్తోంది. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ దెబ్బతినగా, ఇప్పుడు ఒమిక్రాన్ మరోసారి దెబ్బతీస్తోంది.