ముంబై: కరోనా నేపథ్యంలో మందగించిన ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం (నవంబర్ 12) మరో ప్యాకేజీని ప్రకటించారు. తాజాగా కేంద్రం రూ.2.65 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. నిన్న ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్(PLI) స్కీం, నేటి ప్యాకేజీ కలిపి 2.65 లక్షల కోట్లు. నేడు ఉద్యోగాల సృష్టికి ప్రోత్సాహం, క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీం పొడిగింపు, ఉత్పత్తికి ఊతమిచ్చే చర్యలు తీసుకున్నారు.

వివిధ రంగాలకు ఊతం
రియల్ ఎస్టేట్కు ఊతమిచ్చేలా డెవలరప్లు, గృహ కొనుగోలుదారులకు ఆదాయపు పన్నులో ఊరట కల్పించారు. వ్యవసాయానికి మద్దతు ఇచ్చే దిశగా ఎరువుల రాయితీకి రూ.65వేల కోట్లు ప్రకటించారు. దీంతో కోటి నలభై లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. పీఎం గరీబ్ రోజ్గార్ యోజనకు అదనంగా రూ.10వేల కోట్లు కేటాయింపు, ఎగుమతులు పెంచేందుకు ఎగ్జిమ్ బ్యాంకుకు రూ.3వేల కోట్ల కేటాయింపు, దేశీయ రక్షణ పరికరాలు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు, గ్రీన్ ఎనర్జీ కోసం రూ.10,200 కోట్లు కేటాయించారు. కొవిడ్ వ్యాక్సీన్ అభివృద్ధి కోసం రూ.900 కోట్లు మంజూరు చేసింది. దేశీయ ఉత్పత్తికి ఊతమిచ్చేలా రూ.1.46 లక్షల కోట్ల ప్రోత్సాహకాలు, మొబైల్ తయారీరంగాలకు రూ.51,355 కోట్లు ప్రకటించారు. స్వావలంబన పథకంలో భాగంగా 12 రకాల చర్యలను ఈ రోజు ప్రకటించారు.

రూ.29.87 లక్షల కోట్లు... జీడీపీలో 15 శాతం జీడీపీ
గతంలో కేంద్ర ప్రభుత్వం రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. అంతకుముందు దాదాపు రెండు లక్షల కోట్ల ప్యాకేజీని ఇచ్చింది. ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులకు ఎల్టీసీ ప్రయోజనం కల్పించింది. తాజాగా, నిన్న, నేడు పలు రంగాలకు ప్యాకేజీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ.. ఈ రెండు కలిపి ఇప్పటి వరకు రూ.29.87 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. అంటే దాదాపు రూ.30 లక్షల కోట్లు. భారత జీడీపీలో ఇది 15 శాతం.

ఉద్యోగాల కల్పనకు ఊతం
నిర్మలా సీతారామన్ ప్రకటించిన తాజా ప్యాకేజీలో పీఎం ఆవాస్ యోజనకు రూ.18వేల కోట్ల అదనపు నిధులు కేటాయించడం పండుగ సమయంలో శుభవార్త అని నరెడ్కో ప్రెసిడెంట్ నిరంజన్ హీరానందానీ అన్నారు. ఇప్పటికే ఈ ఏడాది 8వేల కోట్లు కేటాయించారని, దీనికి అదనమని చెప్పారు. దీని ద్వారా మరిన్ని ఇళ్ల నిర్మాణానికి, తద్వారా ఇంటి కొనుగోలుదారులకు మరిన్ని ఇళ్లు అందుబాటులోకి రావడం, తద్వారా ఉద్యోగాలు వస్తాయన్నారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగానికి ఇది దోహదపడుతుందన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications