ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో భాగంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం (మే 17) రంగాలకు ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు. ఈ రోజు ఏడు రంగాలపై దృష్టి సారించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా కంపెనీలకు ఊరటనిచ్చే ప్రకటన చేశారు.
కరోనా మహమ్మారి-లాక్ డౌన్ కారణంగా దేశంలో వ్యాపారాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయని నిర్మల చెప్పారు. ఈ వైరస్ వల్ల కలిగిన నష్టాలకు దివాళా స్మృతి నుండి మినహాయింపు ఇస్తున్నట్లు చెప్పారు. నష్టాలకు సంబంధించి ఏడాది వరకు దివాళా ప్రక్రియల నుండి మినహాయింపు ఉంటుందన్నారు. ఎంఎస్ఎంఈలకు సంబంధించి ప్రత్యేక దివాళా విధివిధానాలు ఉంటాయన్నారు. కంపెనీల ఒప్పందాల కాలపరిమితి పొడిగించేందుకు కొన్ని వెసులుబాట్లు ఇస్తామన్నారు. కంపెనీల ఒప్పందాల అభియోగాలపై చట్టపరమైన రక్షణ కల్పించేలా కంపెనీల చట్ట సవరణ ఉంటుందన్నారు.
కంపెనీల చట్టంలో మార్పుల ద్వారా ఇప్పటి వరకు నేరపూరితంగా పరిగణిస్తున్న 7 అంశాలను తొలగిస్తామన్నారు. ఏడు రకాల వాణిజ్య నేరాలను నేర శిక్ష్మాస్మృతి నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారు. నేరపూరిత అంశాలుగా పరిగణించకపోవడం వల్ల కంపెనీలకు తక్షణం ఊరట ఉంటుందని చెప్పారు. అనుమతించిన విదేశాల్లో పబ్లిక్ కంపెనీలు నేరుగా సెక్యూరిటీలను లిస్ట్ చేసుకోవచ్చునని చెప్పారు.

ప్రతి రంగంలోను ఒక ప్రభుత్వరంగ సంస్థ తప్పకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదే సమయంలో ప్రతి రంగంలో ప్రయివేటు పెట్టుబడులను కూడా అనుమతిస్తామన్నారు. నోటిఫై చేసిన రంగాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు తప్పకుండా ఉంటాయన్నారు. నోటిఫై చేసిన రంగాల్లో కనీసం ఒక్క ప్రభుత్వరంగ సంస్థ ఉంటుందన్నారు. ఇప్పటికే ఒకటే రంగంలో ఒకటికి మించి ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను హేతుబద్దీకరిస్తామన్నారు.
10 సంస్థలు ఉంటే ఒకటి గాను లేదా మూడు, నాలుగు సంస్థలుగా విలీనం చేస్తామన్నారు. నోటిఫై చేసిన రంగాల్లో అత్యధికంగా 4 మాత్రమే ప్రభుత్వరంగ సంస్థలు ఉంటాయని చెప్పారు. వ్యూహాత్మక రంగాల్లో కూడా ప్రయివేటు రంగానికి తగిన ప్రాధాన్యం, ఏకరూపత ఇస్తామన్నారు. పీఎం కేర్స్ నిధికి ఇచ్చే విరాళాలను కార్పోరేట్ సామాజిక బాధ్యత కింద చేర్చినట్లు చెప్పారు నిర్మల.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications