For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్లిప్‌కార్ట్ ‘ఇయర్ ఎండ్ సేల్’.. ఎలక్ట్రానిక్స్‌పై 75 శాతం డిస్కౌంట్!

|

ఫ్లిప్‌కార్ట్ 'ఇయర్ ఎండ్ సేల్' శనివారం మొదలైంది. ఈ సేల్ ఈ నెల 23 వరకు కొనసాగనుంది. 'ఇయర్ ఎండ్ సేల్' సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్, ట్యాబ్లెట్స్, ల్యాప్‌టాప్స్, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్లతోపాటు అత్యద్భుతమైన ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తోంది. అలాగే, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్, ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్లు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులపై 75 శాతం రాయితీ ప్రకటించింది.

మొబైల్స్‌పై అద్భుతమైన డీల్స్...

ఫ్లిప్‌కార్ట్ తన 'ఇయర్ ఎండ్ సేల్'లో భాగంగా ఐఫోన్7, రెడ్‌మి నోట్ 7ప్రొ, రెడ్‌మి8, రియల్‌మి 5ప్రొ, వివో జడ్1ప్రొతోపాటు మరిన్ని మొబైల్స్‌పై భారీ రాయితీలు ప్రకటించింది. ఐఫోన్ 8ని రూ.33,999కి, ఐఫోన్ ఎక్స్‌ఎస్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్‌ను రూ.59,990కి అందుబాటులో ఉంచింది. ఇంకా రెడ్‌మి నోట్7 ప్రొ 4జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజీ వేరియంట్‌ను రూ.9,999కే అందుబాటులో ఉంచింది. అంటే ఏకంగా రూ.4 వేల రాయితీ ఇస్తోందన్నమాట.

Flipkart Year End Sale started

ఇక రియల్‌మి 5 ప్రొ 4జీబీ ర్యామ్/64 జీబీ వేరియంట్‌పై రూ.2 వేలు తగ్గించి రూ.11,999కే అందుబాటులోకి తీసుకొచ్చింది. 6జీబీ ర్యామ్/64 జీబీ వేరియంట్‌ను రూ.12,999కి, 8జీబీ ర్యామ్/128 జీబీ వేరియంట్‌ను రూ.14,999కి అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే పిక్సెల్ 3ఎ ఎక్స్ఎల్‌ను రూ.30,999కి, శాంసంగ్ గెలాక్సీ ఎస్9ప్లస్‌ను రూ.29,999కి అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇంకా.. రెడ్‌మి8 4జీబీ ర్యామ్ వేరియంట్‌ను రూ.7,999కి, వివో జడ్1 ప్రొ 4జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజీ వేరియంట్‌ను రూ.12,990కి, 6జీబీ ర్యామ్/64జీబీ వేరియంట్‌ను రూ.13,990కి అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటితోపాటు రెడ్‌మి కె20 4జీబీ/128 జీబీ వేరియంట్‌పై రూ. 4 వేలు, 8జీబీ/128 జీబీ వేరియంట్‌పై వెయ్యి రూపాయల రాయితీ ప్రకటించింది.

ఎలక్ట్రానిక్స్‌పై 75 శాతం రాయితీ..

'ఇయర్ ఎండ్ సేల్'లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్‌పై 75 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. అలాగే ల్యాప్‌టాప్‌లు, యాపిల్ వాచ్‌లు, స్పోర్ట్స్ కెమెరాలు, పవర్ బ్యాంకులు వంటివాటిపైనా భారీ రాయితీలను ఆఫర్ చేస్తోంది. ల్యాప్‌టాప్‌లను రూ.19,999 నుంచి ప్రారంభించగా.. రియల్‌మి 5 ప్రొను రూ.11,999కి, రియల్‌మి 8ను రూ.8,999కి అందుబాటులోకి తీసుకొచ్చింది.

English summary

ఫ్లిప్‌కార్ట్ ‘ఇయర్ ఎండ్ సేల్’.. ఎలక్ట్రానిక్స్‌పై 75 శాతం డిస్కౌంట్! | Flipkart Year End Sale started

Flipkart has begun its Year End Sale, and it claims to list ‘the best offers of 2019'. The e-commerce giant has listed phones like the iPhone 7, Redmi Note 7 Pro, Redmi 8, Realme 5 Pro, Vivo Z1 Pro, and more smartphones at reduced prices. The sale will go on till December 23, and Flipkart has partnered with ICICI Bank to offer 10 percent instant discount on credit card and EMI transactions.
Story first published: Sunday, December 22, 2019, 7:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X