Flipkart అదిరిపోయే ఆఫర్స్: స్మార్ట్ ఫోన్లపై రూ.14,000 వరకు తగ్గింపు
ఆన్లైన్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ బంపర్ స్మార్ట్ ఫోన్ సేల్ను తీసుకు వస్తోంది. మొబైల్స్ బొనాంజా పేరుతో ఐదు రోజుల పాటు వివిధ మొబైల్ ఫోన్లను అతి తక్కువ ధరకు అందించనుంది. అలాగే, ఈ ఆఫర్ ఉన్న రోజుల్లో ప్రతి రోజు సరికొత్త డీల్స్ అందుబాటులో ఉంటాయి. తక్కువ ధరకే మొబైల్ ఆఫర్ సేల్ ఫిబ్రవరి 17వ తేదీన ప్రారంభమై 21వ తేదీన ముగుస్తుంది.
ఆపిల్, వివో, రియల్ మి, శాంసంగ్ బ్రాండ్లపై స్మార్ట్ఫోన్స్ను తగ్గింపు ధరల్లో అందుబాటులో అందించుంది. ముఖ్యంగా ఫ్లాగ్ షిప్, మిడ్ రేంజ్, బడ్జెట్ ఇలా మొబైల్ ఫోన్లపై ఆకర్షణీయమైన తగ్గింపును ప్రకటించింది. యాక్సిస్ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డు కలిగిన వారికి అన్ని ట్రాన్సాక్షన్లపై 10 శాతం అదనపు తగ్గింపు ఉంది.
ఖర్చులు పెరిగి.. ఒంటరి, కానీ: వొడాఫోన్ ఐడియా మూతబడితే.. ఎయిర్టెల్ పరిస్థితేమిటి?
రూ.15,000 కేటగిరీలో..
రూ.15,000 ధర కేటగిరీలో Samsung Galaxy A50, Vivo Z1 Proలు వరుసగా రూ.12,999, రూ.11,990కి లభించనున్నాయి. Vivo Z1x, Realme XT వరుసగా రూ.13,999, రూ.14,999కి రానున్నాయి. Moto G8 రూ.11,999, Xiaomi Mi A3 రూ.11,999, నోకియా కూడా 7.2 హ్యాండ్ సెట్ను రూ.15,499కు తగ్గించింది.
రూ.30వేల కేటగిరీలో..
30 వేలకు తక్కువ కేటగిరీ స్మార్ట్ ఫోన్స్ విషయానికి వస్తే Oppo Reno 10x జూమ్ ఎడిషన్ కేవలం రూ.26,990కే రానుంది. దీని ధర దాదాపు రూ.40వేల వరకు ఉంది. అంటే రూ.13వేలు తగ్గింపు వర్తిస్తుంది. 2019లో ఈ ఫోన్ రివ్యూలు బాగున్నాయి.
రూ.2వేల తగ్గింపు..
Realme X2 Pro రూ.2వేల తగ్గింపుతో రూ.27,999, Black Shark 2 గేమింగ్ స్మార్ట్ ఫోన్ రూ.29,999, Google Pixel 3a సిరీస్ రూ.27,999, Samsung's Galaxy S9 సిరీస్ రూ.22,999 ధరకే రానున్నాయి.
రూ.10వేల లోపు...
రూ.10,000 ధర లోపు స్మార్ట్ ఫోన్స్ అయితే Oppo K1 రూ.9,990 కి వస్తుంది. రూ.25,000 లోపు అయితే Redmi K20 Pro రూ.23,999, Asus 6z రూ.21,999కి వస్తుంది.
ఐవోఎస్కు మారాలనుకుంటే అదిరిపోయే ఆఫర్
iPhone XS ఎప్పుడు లేని భారీ తగ్గింపు ధరకు వస్తుంది. రూ.54,999 నుండి ధరలు ప్రారంభం కానున్నాయి. iPhone 8 రూ.35,999కి లభించనుంది. ఆండ్రాయిడ్ నుంచి ఐవోఎస్కు మారాలనుకునే వారికి ఫ్లిప్కార్ట్ భారీ తగ్గింపుతో అద్భుత ఆఫర్ ఇచ్చింది.