బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తీవ్ర తుపానుగా (Cyclone Montha) బలపడి పలు రాష్ట్రాలను వణికిస్తోంది.ఈ తుఫాను దెబ్బకు ఆంధ్రప్రదేశ్, ఒడిషా రాష్ట్రాలు విలవిలలాడుతున్నాయి.నిన్న సాయంత్రానికి తుఫాన్ చెన్నైకి 420 కిలోమీటర్లు తూర్పు దిశగా, కాకినాడకు 450 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయ దిశగా, విశాఖపట్నానికి 500 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయంగా పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని విశాఖలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గత ఆరు గంటలుగా Cyclone Montha గంటకు 15 కి.మీ వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదిలిందని తెలిపింది.
ప్రస్తుతం మొంథా తుఫాను మచిలీపట్నానికి 190 కి.మీ, కాకినాడకు 270కి.మీ, విశాఖపట్నానికి 340 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది.ఇది ఉత్తర వాయవ్య దిశగా కదులుతోందని తెలిపింది. ఈ రోజు రాత్రికి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు గరిష్ఠంగా 110 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేసింది.

మొంథా తుఫాను నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన పలు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులను రద్దు అయ్యాయి. ఈ మేరకు గన్నవరం విమానాశ్రయం డైరెక్టర్ యం. లక్ష్మీకాంతరెడ్డి సోమవారం వెల్లడించారు. వైజాగ్, హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి, షార్జా వెళ్లి వచ్చే 8 సర్వీసులను రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. తుపాను తీవ్ర రూపం దాల్చితే ఇండిగో విమానం సర్వీసులను సైతం నిలిపివేసే అవకాశం ఉందన్నారు. ఢిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా విమానం సర్వీసు మాత్రం యథావిధిగా నడుస్తుందని ఆయన తెలిపారు.ప్రయాణికులు తమ గమ్యస్థానాల నుండి బయలుదేరే ముందు ఎయిర్లైన్స్ వాళ్లతో సంప్రదించి.. ఆ తర్వాత విమానాశ్రయానికి చేరుకోవాలని సూచించారు.
ఏపీపై మొంథా తుఫాను విరుచుకుపడుతున్న నేపథ్యంలో విశాఖపట్నం నుంచి మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. మొత్తం 43 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే అక్టోబర్ 27వ తేదీన ముందుగా రద్దు అని ప్రకటించిన రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ సోమవారం ప్రకటించింది. ఈ విషయాన్ని గమనించాలని ప్రయాణికులకు సూచించింది. తొలుత 43 రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే రద్దు చేయగా.. ఆ తర్వాత మరో 75కి పైగా రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. అక్టోబర్ 27, 28, 29, 30వ తేదీల్లో ఈ రైళ్లను రద్దు చేసినట్లుగా రైల్వే శాఖ స్పష్టం చేసింది.
Cyclone Montha ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రైలు రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. మంగళవారం, బుధవారం రోజుల్లో నడవాల్సిన పలు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. రాజమహేంద్రవరం, నిడదవోలు, గుంటూరు, కాకినాడ, తెనాలి, రేపల్లె, మార్కాపురం, మచిలీపట్నం, నర్సాపూర్, విశాఖపట్నం, ఒంగోలు, మాచర్ల వంటి స్టేషన్ల నుండి బయలుదేరే అనేక రైళ్లు రద్దు చేయబడ్డాయి. రద్దైన రైళ్ల వివరాలను ప్రయాణికుల మొబైల్ నంబర్లకు మెసేజ్ల రూపంలో పంపించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు పూర్తి రిఫండ్ అందించనున్నట్లు వెల్లడించారు.
ప్రయాణానికి ముందే తమ రైలు స్థితి (status) తెలుసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. NTES మొబైల్ యాప్ లేదా https://enquiry.indianrail.gov.in వెబ్సైట్ ద్వారా రైళ్ల వివరాలను తెలుసుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా దక్షిణ మధ్య రైల్వే, విజయవాడ డివిజన్ సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్లలోనూ సమాచారం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.
తుఫాను పరిస్థితుల నేపథ్యంలో వివిధ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
కంట్రోల్ రూమ్ నంబర్లు:
గూడూరు - 08624-250795
నెల్లూరు - 9063347961
ఒంగోలు - 7815909489
బాపట్ల - 7815909329
తెనాలి - 7815909463
విజయవాడ - 0866-2575167
ఏలూరు - 7569305268
రాజమండ్రి - 8331987657
సామర్లకోట - 7382383188
తుని - 7815909479
అనకాపల్లి - 7569305669
భీమవరం - 7815909402
గుడివాడ - 7815909462
రైళ్లకు సంబంధించిన ఎటువంటి సందేహాలు ఉన్నా ప్రయాణికులు సమీప రైల్వే స్టేషన్ అధికారులను సంప్రదించవచ్చని రైల్వే శాఖ సూచించింది.
More From GoodReturns

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

1 Crore: 10 ఏళ్లలో రూ. 1 కోటి..! రిస్క్ లేకుండా కోటీశ్వరులు అయ్యే ప్లాన్ ఇదే!

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..



Click it and Unblock the Notifications