Mobikwik IPO: దేశంలో ప్రస్తుతం ఐపీవోల కోలాహలం కొనసాగుతోంది. ఈ క్రమంలో కొన్ని స్టార్టప్ కంపెనీలు సైతం తమ ఐపీవో ప్రయాణాన్ని మెుదలు పెడుతున్నాయి.
యూపీఐ చెల్లింపుల వ్యాపారంలో ఉన్న ఫిన్టెక్ యునికార్న్ MobiKwik తన రాబోయే ఐపీవోలో తాజా ఈక్విటీ షేర్ల జారీ చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా మార్కెట్ల నుంచి రూ.880 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్ కంపెనీ ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసింది. ఈ ఐపీవోలో ఎలాంటి ఆఫర్ ఫర్ సేల్ ఉండబోదని కంపెనీ వెల్లడించింది.

పేమెంట్స్ కంపెనీ నిర్ణయం ప్రకారం మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వద్ద డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP)ని ఫైల్ చేయనుంది. ఐపీవో ఆఫర్లో సెబీకి రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (RHP) ఫైల్ చేసే ముందు కొంతమంది పెట్టుబడిదారులకు రూ.176 కోట్ల వరకు ప్రీ-ఐపీవో ప్లేస్మెంట్ కూడా ఉంటుందని తెలుస్తోంది. వాస్తవానికి కంపెనీ జూలై 2021లో సెబీ వద్ద ఐపీవో కోసం దరఖాస్తు చేసినప్పుడు మార్కెట్ల నుంచి రూ.1,900 కోట్లను సేకరించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. అయితే ప్రస్తుతం మాత్రం దీనిని దాదాపు సగానికి కుదించింది. గతంలో ఐపీవో మెుత్తంలో రూ.400 కోట్లు ఆఫర్ ఫర్ సేల్ ఉన్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
కంపెనీ గత ఆర్థిక సంవత్సరం కంటే నష్టాలను తగ్గించుకుంటూ ఆర్థిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటోంది. FY23లో స్టార్టప్ నికర నష్టం FY22లో రూ.128.1 కోట్ల నుంచి 35% తగ్గి రూ.83.8 కోట్లకు తగ్గింది. ఇదే సమయంలో కంపెనీ ఖర్చులు సైతం తగ్గాయి. చెల్లింపు గేట్వే ఛార్జీలు, మొత్తం ఖర్చులకు అతిపెద్ద సహకారి. ఇవి గత ఆర్థిక సంవత్సరంలో రూ.227.6 కోట్ల నుంచి 31% పడిపోయి రూ.156.6 కోట్లకు పడిపోయాయి. స్టార్టప్ నష్టాలు తగ్గినప్పటికీ.. దాని ఆదాయం FY23లో దాదాపు ఫ్లాట్గా ఉంది. కంపెనీని 2009లో బిపిన్ ప్రీత్ సింగ్, ఉపాసన టకు స్థాపించారు.


Click it and Unblock the Notifications