Multibagger Stock: దేశీయ స్టాక్ మార్కెట్లలో చాలా కంపెనీలు తమ షేర్లను లిస్ట్ చేశాయి. వీటిలో చాలా మందిని ఎక్కువ శాతం ఆకర్షించేవి పెన్నీ స్టాక్స్. ఇవి తక్కువ ధరలకు లభిస్తుంటాయి. వీటిలో రిటర్న్స్ ఎలా ఉంటాయో.. రిస్క్ కూడా అంతే ఎక్కువ మెుత్తంలో ఉంటుందని గుర్తుంచుకోవాలి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది కెమికల్ రంగంలోని పెన్నీ మల్టీబ్యాగర్ స్టాక్ గురించి. ఈ రంగంలోని ఫినోటెక్స్ కెమికల్ కంపెనీ షేర్లు ఇన్వెస్టర్లను లక్షాధికారులుగా మార్చేశాయి. దీర్ఘకాలంలో పెట్టుబడిని కొనసాగించిన వారు ప్రస్తుతం మల్టీబ్యాగర్ రాబడును పొందుతున్నారు.

ఒక్కో షేరు ధర రూ.2 వద్ద ఉన్న ఈ పెన్నీ స్టాక్ 10 ఏళ్ల కాలంలో తన ఇన్వెస్టర్లకు ఏకంగా 10,837 శాతం రాబడిని అందించింది. ఆ సమయంలో ఎవరైనా వ్యక్తి కనీసం లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఉంటే వారు ఇప్పుడు కోటీశ్వరులుగా మారిపోయేవారు. ప్రస్తుతం మార్కెట్లో ఈ కంపెనీ షేర్ ధర రూ.256 వద్ద ఉంది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం వారి సంపద రూ.1.28 కోట్లకు చేరుకునేది.
కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.26 కోట్లుగా ఉంది. కంపెనీ షేర్లలో ప్రమోటర్లు 65.03 శాతం వాటాలను కలిగి ఉన్నారు. మిగతా 34.97 శాతం వాటా సాధారణ ఇన్వెస్టర్ల వద్ద ఉంది. గడచిన మూడేళ్ల కాలంలో కంపెనీ షేర్ విలువ 1300 శాతం మేర పెరిగింది. ఎవరైనా వ్యక్తి కనీసం 5 ఏళ్ల కిందట కంపెనీలో డబ్బు పెట్టుబడి పెట్టి ఉంటే వారికి దాదాపు 250 శాతం రాబడి వచ్చి ఉండేది. ప్రముఖ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా కంపెనీలో 2.82 శాతం వాటాలను కలిగి ఉన్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications