Nirmala Sitharaman: ప్రధాని మోదీ ప్రకటన చేసిన నాటి నుంచి లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఆసక్తిగా 8వ వేతన సంఘానికి సంబంధించిన వార్తల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించిన వివిధ వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో తమకు వేతనాలు, పెన్షనర్ల విషయంలో ఎంత మేరకు ప్రయోజనాలు కలుగుతాయనే విషయాలను గమనిస్తున్నారు.
ఈ క్రమంలోనే 8వ వేతన సంఘం అమలు 36 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ పౌర ఉద్యోగులు, పెన్షనర్లకు, రక్షణ సిబ్బందితో పాటు వారి పెన్షనర్లకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు వెల్లడించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ పౌర ఉద్యోగులు, పెన్షనర్ల సంఖ్య మార్చి 1, 2025 నాటికి రూ.36.57 లక్షలుగా ఉందని వెల్లడించారు. ఇది గత డిసెంబర్ 31, 2024 నాటికి 33.91 లక్షలుగా ఉన్నట్లు ఆమె వెల్లడించారు. ఈ క్రమంలో కేంద్రం ఆర్థిక మంత్రి, రక్షణ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సిబ్బంది & శిక్షణ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు వంటి వాటాదారులు ఇచ్చిన సూచనలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని ఆమె వెల్లడించారు.
వాస్తవానికి 8వ వేతన సంఘం ద్రవ్యోల్బణం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని దాని ద్వారా వచ్చే ఆర్థిక ప్రభావాలను అంచనా వేసి తదనుగుణంగా ఉద్యోగులు, పెన్షనర్లకు అందించాల్సిన పెంపుల గురించి సిఫార్సులు చేస్తుంది. ప్రతి పదేళ్లకు ఒకసారి వేతన కమిషన్ ఏర్పాటు చేయటం సహజంగా జరిగే పనేనని ఉద్యోగులకు తెలిసిన విషయమే. కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన నివేదికను నిర్ణీత సమయంలో నిర్ణయించబడుతుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

ప్రధాని మోదీ మాత్రం ఇద్దరు సభ్యులు, ఒక ఛైర్మన్తో ప్యానల్ ఏర్పాటు చేయనున్నట్లు గతంలోనే ప్రకటించారు. వాస్తవానికి ప్రస్తుతం అమలులో ఉన్న 7వ వేతన సంఘానికి గడువు డిసెంబర్ 31, 2025తో ముగియనున్న వేళ దీని తర్వాత కొత్త సంఘం అమలు చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా ఆర్థిక మంత్రి నుంచి దీనికి సంబంధించి ప్రకటన చేయకపోవటంతో మరో బడ్జెట్ వరకు ఆగాల్సి ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే ఉద్యోగులు తమ వేతన పెంపుల కోసం ఏడాది వేచి ఉండాల్సి రావొచ్చు. దీనికి ముందు 7వ వేతన సంఘం ఏర్పాటు సమయంలో కూడా కమిషన్ ఏర్పాటుకు చాలా సమయం పట్టింది.
ప్రయోజనం ఏంటి..?
వచ్చే సంవత్సరం నుంచి కొత్త వేతన సంఘం అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్యూన్లు, అటెండర్లకు గతంలో రూ.18,000గా ఉన్న మూలవేతనం రూ.51,480కు పెరిగే పెరగవచ్చు. అలాగే సీనియర్ క్లర్క్, ఉన్నత స్థాయి సాంకేతిక సిబ్బందికి రూ.29,200గా ఉన్న బేసిక్ వేతనం రూ.83,512కు పెరిగే అవకాశం ఉంది. గ్రూప్ ఏ స్థాయి అధికారుల వేతనం రూ.56,100 నుంచి రూ.1,60,446 బేసిక్ పెరుగుతుందని తెలుస్తోంది. ఇలాగే ఇతర కేటగిరీలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు సైతం పెరగవచ్చు.
ఈ క్రమంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను 2.57 నుంచి 2.86కు పెంచే అవకాశం ఉందని, ఇది ఉద్యోగుల బేసిక్ వేతనాలపై గణనీయమైన ప్రభావం చూపుతుందని నివేదికలు చెబుతున్నాయి. గతంలోనూ 6వ వేతన సంఘం నుంచి 7వ వేతన సంఘానికి మారినప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నిర్మాణంలో గణనీయమైన పురోగతిని కనిపించింది. 7వ వేతన సంఘం కింద 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను అమలు చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మూల వేతనం 2.57తో గుణించబడటంతో వారి ప్రాథమిక వేతనంలో 2.57 శాతం మేర పెరుగుదలకు కారణమైంది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications