Nirmala Sitharaman: ఆ రంగాల్లో ప్రభుత్వ వాటా అమ్మలేము..
వ్యాపారాలకు భారతదేశం గమ్యస్థానమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రైవేట్ రంగానికి అందుబాటులో లేని రంగం భారతదేశంలో లేదని,ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను అమ్మే ప్రయత్నంలో ఉందన్న ప్రతిపక్ష విమర్శలను ఆమె తిరస్కరించారు. ప్రతీ ప్రభుత్వ రంగ సంస్థను అమ్మాలని ప్రభుత్వానికి లేదని నిర్మలా స్పష్టం చేశారు.
టెలికాంతో పాటు పలు వ్యూహాత్మక రంగాల్లో ప్రభుత్వ తన వాటా అమ్మబోదన్నారు. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం లేదా మరో ప్రభుత్వ రంగ సంస్థలో విలీనం చేయడం లేదా మూసేస్తామని చెప్పారు. అణువిద్యుత్, స్పేస్, రక్షణ, రవాణా, టెలికమ్యూనికేషన్స్, విద్యుత్, పెట్రోలియం, బొగ్గు, ఇతర ఖనిజాలు, బ్యాంకింగ్, బీమా, ఆర్థిక సేవల రంగంలో ప్రభుత్వం తన వాటాలను అమ్మబోదన్నారు.

జీ20లో భారత్ గ్లోబల్ సౌత్ వాయిస్ని మారుస్తోందని ఆమె అన్నారు. సుశిక్షితులైన యువత, మధ్యతరగతి క్యాప్టివ్ మార్కెట్ను అందించడం, సాంకేతికతతో నడిచే పెట్టుబడి, ప్రజా మౌలిక సదుపాయాలు భారతదేశ స్థిరమైన వృద్ధికి కారణాలని సీతారామన్ అన్నారు. క్లైమేట్ ఫైనాన్స్ గురించి ప్రస్తావిస్తూ, అనుసరణ, ఉపశమనాలు రెండింటినీ చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.
"G20లో భాగమైన పలువురు మంత్రులు స్నేహపూర్వకంగా మాట్లాడుతున్నారు. భారతదేశం, నేడు, వ్యాపారాలకు గమ్యస్థానంగా ఉంది." అని ఆమె చెప్పారు. అమెరికా ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్ గత నెలలో తన భారత పర్యటన సందర్భంగా, భారతదేశంతో సహా విశ్వసనీయ వ్యాపార భాగస్వాములతో ఏకీకరణను బలోపేతం చేయడం ద్వారా తన సరఫరా గొలుసుల స్థితిస్థాపకతను పెంచడానికి వాషింగ్టన్ "ఫ్రెండ్షోరింగ్" అనే విధానాన్ని ముందుకు తీసుకువెళుతున్నట్లు చెప్పారు.


Click it and Unblock the Notifications