భారతదేశంలో ఈసారి దీపావళి పండుగ కేవలం వెలుగుల పండుగగా మాత్రమే కాకుండా.. వ్యాపారులకూ వెలుగులు నింపిన సీజన్గా నిలిచింది. దేశవ్యాప్తంగా రిటైల్, హోల్సేల్, సర్వీస్ రంగాలు కలిపి దాదాపు రూ. 5 లక్షల కోట్లకు పైగా అమ్మకాలు జరిగినట్లు అఖిల భారత వర్తకుల సమాఖ్య (CAIT) ప్రకటించింది. ఇది గత సంవత్సరపు రూ. 4.75 లక్షల కోట్ల అంచనాలను మించిపోవడం గమనార్హంగా చెప్పుకోవచ్చు.
ఈ రికార్డు స్థాయి వ్యాపారానికి ప్రధాన కారణం. భారతీయ తయారీ ఉత్పత్తులపై పెరిగిన ప్రజల ఆసక్తి. పెద్ద నగరాల నుండి చిన్న పట్టణాల వరకు వోకల్ ఫర్ లోకల్ భావన బలంగా ప్రతిఫలించింది. దేశీయ ఉత్పత్తుల కొనుగోలుపై ప్రజలు దృష్టి పెట్టడంతో విదేశీ, ఆన్లైన్ అమ్మకాలు ఈసారి గణనీయంగా తగ్గాయి.

CAIT జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న GST రేటు తగ్గింపులు, అలాగే స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం ఇచ్చిన విధానాలు వాణిజ్యానికి నూతన శక్తిని అందించాయని తెలిపారు. అలాగే విదేశీ అమ్మకాలు భారీగా తగ్గిపోయాయని తెలిపారు.
ఈసారి మార్కెట్లలో కొనుగోలు ఉత్సాహం అంతంత మాత్రమే కాదు, భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్లు.. నిండిపోయిన షాపింగ్ మాల్స్, లైట్లు మెరిసే వీధులు ఈ ఉత్సాహాన్ని స్పష్టంగా చూపించాయి. ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, జైపూర్, చెన్నై, కోల్కతా, లక్నో, ఇండోర్, పాట్నా, భోపాల్ వంటి నగరాల్లో అర్థరాత్రి వరకు అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ దీపావళి సీజన్లో సాంప్రదాయ వస్తువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
మట్టి దీపాలు (దియాలు),కొవ్వొత్తులు,అలంకార లైటింగ్ కు అసాధారణ డిమాండ్ ఉంది.
దుస్తులు,బంగారం, వెండి ఆభరణాలు భారీగా అమ్ముడయ్యాయి.
గృహ ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్లు, స్వీట్లు, డ్రై ఫ్రూట్స్ కూడా అధిక డిమాండ్లో ఉన్నాయి.
సేవా రంగం కూడా లాభాల్లో : రిటైల్ మార్కెట్ మాత్రమే కాకుండా సర్వీస్ రంగం కూడా ఈ పండుగ సీజన్లో భారీ లాభాలను చూస్తోంది. ఈవెంట్ మేనేజ్మెంట్, క్యాబ్ సర్వీసులు, గిఫ్ట్ ప్యాకేజింగ్, డెకరేటర్లు, బాణసంచా విక్రేతలు, స్వీట్లు తయారీదారులు వంటి వారు వ్యాపారంలో గణనీయమైన వృద్ధిని సాధించారు.
ముందున్న పండుగలు, పెళ్లి సీజన్: అక్టోబర్ 18న ధంతేరాస్, అక్టోబర్ 23న భాయ్ దూజ్, అక్టోబర్ 27-28న ఛత్ పూజతో పండుగ కాలం కొనసాగనుంది. ఆ తరువాత పెళ్లి సీజన్ మొదలవుతుంది, ఇది డిసెంబర్ 14 వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో ఆభరణాలు, వస్త్రాలు, క్యాటరింగ్, హాస్పిటాలిటీ రంగాలు మరింతగా లాభపడే అవకాశం ఉంది.
ఆర్థిక వ్యవస్థకు ఉత్సాహం : ఈ పండుగ సీజన్లో రికార్డు స్థాయిలో వ్యాపారం జరగడం భారత ఆర్థిక వ్యవస్థకు శుభసూచకంగా కనిపిస్తోంది. వినియోగదారుల విశ్వాసం పెరగడం, స్థానిక ఉత్పత్తులపై ప్రేమ పెరగడం, చిన్న వ్యాపారులు పునరుద్ధరించబడటం అన్నీ కలిపి భారత ఆర్థిక వ్యవస్థకు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి.
క్లుప్తంగా చెప్పాలంటే ఈ దీపావళి భారత మార్కెట్కి రికార్డు Sales తో "సువర్ణ సీజన్"గా నిలిచింది. స్థానిక ఉత్పత్తుల విజయ గాధ, వినియోగదారుల ఉత్సాహం, ప్రభుత్వ సహకారం..ఇవన్నీ కలిపి దేశ ఆర్థిక వృద్ధికి కొత్త దిశ చూపుతున్నాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications