హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఫెరారీ కారు ప్రమాదం నగరవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అత్యంత వేగంతో దూసుకొచ్చిన ఫెరారీ కారు ఒక్కసారిగా అదుపు తప్పి వరుసగా వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలు కార్లు, ద్విచక్ర వాహనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఫెరారీ కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోగా, రోడ్డుమధ్యలో ఉన్న లైట్ మాస్ట్ కూడా విరిగి పడిపోయింది. కారు ఎంత వేగంగా వచ్చిందో ఈ దృశ్యాలే చెప్పకనే చెబుతున్నాయి.
ఈ ప్రమాదం టాలీవుడ్ సీనియర్ నటుడు Nandamuri Balakrishna నివాసానికి సమీపంలోని ప్రాంతంలో చోటు చేసుకోవడం మరింత ఆసక్తిని రేపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త క్రాంతి రెడ్డి ఈ ఫెరారీ కారును నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కారు నంబర్ TS 07 HK 8797గా నమోదు అయింది. వేగంగా డ్రైవ్ చేస్తున్న సమయంలో బ్రేకులు సరిగా పనిచేయకపోవడం.. అదే సమయంలో స్టీరింగ్ అకస్మాత్తుగా లాక్ కావడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ప్రమాదం జరిగిన వెంటనే ఆ మార్గంలో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ధ్వంసమైన వాహనాలను క్రేన్ల సహాయంతో తొలగించి, వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.ఈ ఘటనలో ముగ్గురికి గాయాలైనట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, అధిక వేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
ఓ వైపు హైదరాబాద్లో ఫెరారీ ప్రమాద వార్తలు కలకలం రేపుతుండగా.. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా Ferrari సంస్థ ఆర్థిక విజయాలతో వార్తల్లో నిలుస్తోంది. యూరప్ ఆటోమోటివ్ రంగం ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల మార్పిడి.. కఠినమైన ఉద్గార నిబంధనల వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నా, ఫెరారీ మాత్రం ఈ ఒత్తిడులను దాటుకుని బలమైన ఫలితాలు సాధిస్తోంది. పరిమిత ఉత్పత్తి, అధిక మార్జిన్లు, ప్రత్యేకతకు ప్రాధాన్యత ఇవ్వడం ఫెరారీ విజయానికి కారణంగా నిలుస్తున్నాయి.
2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫెరారీ అత్యంత బలమైన ఫలితాలను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 13,640 వాహనాలను డెలివరీ చేసి, గత ఏడాదితో పోలిస్తే స్వల్ప తేడాతోనే కొత్త రికార్డును మిస్ చేసింది. అయినప్పటికీ, ఆర్థిక పరంగా కంపెనీ దాదాపు 7.8 బిలియన్ డాలర్ల నికర ఆదాయాన్ని నమోదు చేసింది. లాభదాయకత, ఆపరేటింగ్ మార్జిన్లు చరిత్రలోనే అత్యున్నత స్థాయికి చేరుకున్నాయి.
ఈ విజయాన్ని ఉద్యోగులతో పంచుకోవాలని ఫెరారీ నిర్ణయించింది. ఇటలీలోని మారనెల్లో కేంద్రంగా పనిచేస్తున్న సుమారు 5 వేల మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికి సగటున 15,800 డాలర్ల వరకు రికార్డు స్థాయి బోనస్లను ప్రకటించినట్లు కంపెనీ సీఈవో బెనెడెట్టో విగ్నా తెలిపారు. ఇది కంపెనీ లాభాల భాగస్వామ్య విధానానికి నిదర్శనంగా నిలుస్తోంది.
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఫెరారీ భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ దశాబ్దం చివరి నాటికి కనీసం 20 కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తోంది. ముఖ్యంగా 2026 మేలో తన తొలి పూర్తి ఎలక్ట్రిక్ సూపర్కార్ 'లూస్'ను ఆవిష్కరించనుంది. అయితే విద్యుదీకరణతో పాటు సంప్రదాయ V6, V8, V12 ఇంజిన్లను కూడా కొనసాగించాలనే వ్యూహంతో ఫెరారీ ముందుకెళ్తోంది.
More From GoodReturns

Hyderabad: ఇక ట్రాఫిక్ టెన్షన్ లేదు! సిటీలో కొత్త అండర్ పాస్, స్టీల్ బ్రిడ్జికి లైన్ క్లియర్! ఎక్కడంటే..

Hyderabad: షాపింగ్, వెల్నెస్, గ్యాస్ట్రోనమీ.. హైదరాబాద్ బ్రాండింగ్ మార్చబోతున్న మూడు కీలక స్తంభాలు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications