అమెరికా ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గడంతో పాటు ఆర్థిక డేటా మిశ్రమంగా ఉండడాన్ని దృష్టిలో ఉంచుకుని.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ తన ప్రామాణిక వడ్డీ రేటును మరోసారి 25 బెసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన విధాన ప్రకటనల్లో ఒకటి. 43 రోజుల పాటు కొనసాగిన అమెరికా ప్రభుత్వ షట్డౌన్ వల్ల ముఖ్యమైన ఆర్థిక డేటా విడుదలల్లో ఆలస్యం జరిగింది.
అదే సమయంలో ట్రంప్ పరిపాలన వచ్చే సంవత్సరం మధ్యంతర ఎన్నికల ముందు సడలించిన విధానాలను అనుసరించాలని ఫెడ్పై ఒత్తిడి తెచ్చిన విషయం కూడా ఈ నిర్ణయంపై ప్రభావం చూపింది. ఈ అనిశ్చితి మధ్య వెలువడిన తాజా రేటు తగ్గింపు.. 2026లో ప్రపంచ ద్రవ్య విధానం ఎలా మలుపు తిరుగుతుందనే దానిపై స్పష్టమైన దిశను చూపుతోంది. ఫెడరల్ ఫండ్ రేటు ఇప్పుడు 3.5 నుంచి 3.75 శాతం శ్రేణిలోకి వచ్చింది.

అమెరికాలో ద్రవ్యోల్బణం గత సంవత్సరం గరిష్ట స్థాయిల నుంచి పడిపోయినప్పటికీ ఇంకా ఫెడరల్ రిజర్వ్ నిర్దేశించిన 2 శాతం లక్ష్యాన్ని మించి కొనసాగుతోంది. ఉద్యోగాల పెరుగుదల మందగించినప్పటికీ, లేబర్ మార్కెట్ మాత్రం ఇంకా బలంగానే ఉంది. ఈ పరిస్థితులు ఫెడ్ను మరింత జాగ్రత్త ధోరణి వైపు నడిపిస్తున్నాయి. న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ అధ్యక్షుడు జాన్ విలియమ్స్ భీమా చర్యగా వడ్డీ రేటు తగ్గింపు అవసరమని ఇటీవల వ్యాఖ్యానించడంతో.. మార్కెట్లు ఈ నిర్ణయానికి 87 శాతం అవకాశాన్ని ముందే అంచనా వేశాయి.
కానీ ఫెడ్లో అంతర్గత విభేదాలు పెరుగుతున్నాయి. ఫెడ్లోని 19 మంది సభ్యులు 2026 కోసం ప్రతిపాదించిన రేటు కోతల అంచనాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఏడుగురు అధికారులు వచ్చే ఏడాది ఎలాంటి కోతలు ఉండవని భావిస్తుండగా.. ఎనిమిది మంది రెండు లేదా అంతకంటే ఎక్కువ కోతలు అవసరమని భావిస్తున్నారు. నలుగురు మాత్రం ఒక్క చిన్న కోత సరిపోతుందని అంటున్నారు. ఇంకా అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ సభ్యులందరికి ఓటు హక్కు లేకపోవడం, నిజంగా విధానంపై నిర్ణయం తీసుకునే 12 మంది మాత్రమే తమ అభిప్రాయాన్ని అధికారికంగా నమోదు చేశారు. ఈ విభేదాలు అమెరికా ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు ఎంత అస్థిరంగా ఉందో చెబుతున్నాయి.
భారతదేశం విషయంలో ఈ నిర్ణయ ప్రభావం త్వరగా కనిపించే అవకాశం ఉంది. అమెరికా వడ్డీ రేట్లు తగ్గితే డాలర్ బలహీనమవుతుంది, దీంతో విదేశీ పెట్టుబడులు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు ముఖ్యంగా భారతదేశానికి చేరే అవకాశాలు పెరుగుతాయి. కానీ ఇటీవలి వారాల్లో రూపాయి ఇప్పటికే ఒత్తిడిలో ఉంది. దేశీయ వాణిజ్య ఆందోళనలు, గ్లోబల్ రిస్క్ అవర్షన్, ఫెడ్ విధానంపై అనిశ్చితి రూపాయిపై అదనపు భారాన్ని మోపాయి.
అధిక వడ్డీ రేటు వాతావరణం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులను కఠినతరం చేస్తోంది. అర్థ భారత్ గ్లోబల్ మల్టిప్లయర్ ఫండ్ మేనేజర్ నచికేత సావ్రికర్ చెప్పినట్లు, ఈ అనిశ్చితి భారత ఆస్తుల విలువలపై ఒత్తిడి పెంచుతోంది. ముఖ్యంగా రేటు-సున్నితమైన రంగాలలో మార్పులకు కారణమవుతోంది. ఎఫ్ఐఐ (FII) ప్రవాహాలు కూడా రాబోయే రోజుల్లో అస్థిరంగా ఉండే అవకాశం ఉంది. ఇది భారతీయ ఈక్విటీలు, బాండ్ మార్కెట్లపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. బంగారం ధరలు మాత్రం ఈ వాతావరణంలో భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గ్లోబల్ అనిశ్చితి పెరిగినప్పుడు ఇన్వెస్టర్లు సేఫ్ హేవెన్ ఆస్తులను ఆశ్రయించటం సహజం.
More From GoodReturns

భారత్ టైర్ పరిశ్రమను కుదిసేస్తున్న ఇరాన్ యుధ్ద ప్రభావం.. కీలకమైన హెచ్చరిక చేసిన CLSA

ఇరాన్–అమెరికా యుద్ధంపై షాకింగ్ న్యూస్.. ఎవరి ఆయుధాలు ముందుగా అయిపోతాయో తెలుసా..

ఇరాన్పై యుద్ధంతో ఖాళీ అవుతున్న అమెరికా ఖజానా.. తొలి 24 గంటల్లోనే రూ. 7 వేల కోట్లకు పైగా ఖర్చు..

Iran war: ఇరాన్లో హై అలర్ట్: ఖమేనీ అంత్యక్రియలు వాయిదా.. ఏం జరుగుతోంది?

ఇరాన్ మీద దాడులు.. బట్ట బయలైన అమెరికా కుట్రలు.. ప్రపంచానికి నిజాన్ని తెలిపిన స్పెయిన్..

మిత్రుడిని అమెరికా చంపేస్తుంటే మౌనంగా చూస్తుండిపోయిన చైనా.. సైలెంట్ వెనక మిస్టరీ ఇదే..

Anthropic: ఇరాన్ దాడిలో ఆంత్రోపిక్ ఏఐ వినియోగం? అమెరికాలో ముదురుతున్న వివాదం!

భారత ఆర్థిక వ్యవస్థని కుదిపేస్తున్న గల్ఫ్ యుద్ధ మంటలు.. ప్రమాదంలో 9 కోట్ల మంది పంపే డబ్బు ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..



Click it and Unblock the Notifications