జాతీయ రహదారిని ఉపయోగించే ద్విచక్ర వాహనాలకు పెద్ద వార్త రాబోతోంది. సమాచారం ప్రకారం, ఇప్పుడు ద్విచక్ర వాహనాలు కూడా జాతీయ రహదారి టోల్పై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నియమం జూలై 15 నుండి అమల్లోకి వస్తుంది.

సమాచారం ప్రకారం మీరు ద్విచక్ర వాహనం కొన్నప్పుడు, ఆ సమయంలో టోల్ పన్ను వసూలు చేయబడుతుంది. అంటే దీని అర్ధం ద్విచక్ర వాహనాలు జాతీయ రహదారిపై టోల్ ప్లాజా నుండి వెళ్ళినప్పుడు వారి నుండి టోల్ పన్ను వసూలు చేయదు. జాతీయ రహదారిపై నాలుగు చక్రాల వాహనాలు లేదా అంతకంటే ఎక్కువ వాహనాల నుండి మాత్రమే టోల్ పన్ను వసూలు చేయబడుతుంది.
కొత్త నిబంధన ప్రకారం, ఇప్పుడు ద్విచక్ర వాహనదారులు FASTag ద్వారా టోల్ చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైనా నిబంధనను ఉల్లంఘించినట్లయితే వారు రూ.2,000 జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది.
దేశంలో NHAIకి ఎన్ని టోల్ ప్లాజాలు ఉన్నాయి: NHAI టోల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ రికార్డుల ప్రకారం, దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మొత్తం 1057 NHAI టోల్లు ఉన్నాయి. వీటిలో దాదాపు 78 టోల్లు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. బీహార్లో 33 జాతీయ రహదారి టోల్లు ఉండగా, ఉత్తరప్రదేశ్లో 123 టోల్ ప్లాజాలు ఉన్నాయి.
ఆగస్టు 15 నుండి రూ.3 వేల పాస్: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల టోల్ కు సంబంధించి కొత్త పథకాన్ని ప్రకటించారు. దింతో ఫాస్ట్ ట్యాగ్ ఆధారిత అన్యువల్ టోల్ పాస్ స్కిం ప్రవేశపెట్టారు. ఈ పథకం ఆగస్టు 15 నుండి ప్రారంభమవుతుంది. ఈ పాస్ ధర రూ. 3000 ఇంకా 200 ప్రయాణాలు చేయవచ్చు. ఈ పథకం NHAI అలాగే NE టోల్ ప్లాజాలలో మాత్రమే చెల్లుతుంది. రాష్ట్ర రహదారి కింద ఉన్న టోల్ బూత్లలో ఈ పాస్ చెల్లదు.
60 కి.మీ పరిధిలో ఉన్న టోల్ ప్లాజాల గురించి చాలా కాలంగా ఉన్న ఆందోళనలను ఈ విధానం పరిష్కరిస్తుందని, సరసమైన లావాదేవీ ద్వారా టోల్ చెల్లింపును సులభం చేస్తుందని నితిన్ గడ్కరీ అన్నారు. ఈ ఏడాది పాస్ లక్షలాది ప్రైవేట్ వాహనదారులకు వేచి ఉండే సమయం, రద్దీని తగ్గించడం అలాగే టోల్ ప్లాజాల వద్ద వివాదాలను తగ్గించడం ద్వారా వేగవంతమైన, సున్నితమైన ప్రయాణ అనుభవాన్ని అందించడం కోసం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి అన్నారు.
టోల్ రేట్ల సంగతేంటి : ద్విచక్ర వాహనాల టోల్ ఛార్జీలు హైవే రకం (జాతీయ లేదా రాష్ట్ర), టోల్ ఆపరేటర్, ప్రయాణించిన దూరం బట్టి ఉంటుంది. అలాగే రేట్లు వీటి ఆధారంగా మారే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications