PM Kisan News: పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కోసం చాలా మంది రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం 19వ విడత డబ్బు విడుదలకు సర్వం సిద్ధం అయ్యింది. ప్రధాని మోదీ దేశంలోని రైతుల ప్రజలకు సహాయం కోసం వాస్తవానికి దీనిని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
వచ్చే వారం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత కోట్లాది మంది రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 24న బీహార్లోని భాగల్పూర్ నుంచి నిధులను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద ఏటా రూ.6,000 డీబీటీ బెనిఫిట్ కింద నేరుగా ఖాతాలో జమచేస్తున్న సంగతి తెలిసిందే. దీనికింద దేశంలోని అర్హులైన రైతులందరికీ ప్రతి 4 నెలలకు ఒకసారి అంటే ఏడాదికి మూడు దఫాలుగా రైతుల ఖాతాలోకి పీఎం కిసాన్ నిధులను ఎలాంటి మధ్యవర్తులు లేకుండా బ్యాంక్ అకౌంట్లలోకి జమచేయబడుతున్న సంగతి తెలిసిందే.

పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ప్రకారం మరో మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు నేరుగా జమచేయబడతారు. పీఎం కిసాన్ లో నమోదైన రైతులకు eKYC తప్పనిసరి. OTP ఆధారిత eKYC PMKISAN పోర్టల్లో అందుబాటులో ఉంది లేదా బయోమెట్రిక్ ఆధారిత eKYC కోసం సమీపంలోని CSC కేంద్రాన్ని సంప్రదించటం ద్వారా ప్రక్రియను పూర్తి చేయవచ్చు. స్కీమ్ బెనిఫిట్స్ పొందటానికి సదరు వ్యక్తి భారత పౌరుడై ఉండాలి. తక్కువ భూమి కలిగిన రైతై ఉండాలి. నెలకు పెన్షన్ రూపంలో రూ.10 వేల కంటే ఎక్కువ ఆదాయం ఉండకూడదు.
खुशहाली और समृद्धि के खुलेंगे द्वार, जब किसानों के खातों में आएंगे ₹2000
— Agriculture INDIA (@AgriGoI) February 17, 2025
माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी पीएम किसान सम्मान निधि की 19वीं किस्त का ट्रांसफर 24 फरवरी 2025 को भागलपुर, बिहार से करेंगे।
सभी किसान भाई-बहन योजना का लाभ उठाने के लिए आज ही अपनी eKYC पूरी करवाएं।… pic.twitter.com/XvoBFDR0H3
పిఎం కిసాన్ ఇన్స్టాల్మెంట్ మొత్తాన్ని అందుకోవడానికి లబ్దిదారుడు రైతుల ఆధార్ కార్డు తప్పనిసరిగా వారి బ్యాంకు ఖాతాతో అనుసంధానించబడి ఉండాలి. ఈ పథకాన్ని పొందేందుకు eKYC, యాక్టివ్ బ్యాంక్ ఖాతాతో ఆధార్ లింక్ అవసరం. ఈ ప్రభుత్వ పథకంలో భూమి ధృవీకరణ కూడా ఒక ముఖ్యమైన ప్రక్రియ. జాబితాలోని పేరును తనిఖీ చేయడానికి రైతులు ముందుగా PM కిసాన్ అధికారిక వెబ్సైట్ www.pmkisan.gov.inని సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ హోమ్ పేజీలో 'బెనిఫిషియరీ లిస్ట్' ట్యాబ్పై క్లిక్ చేసి.. రాష్ట్రం, జిల్లా, ఉపజిల్లా, బ్లాక్, గ్రామం వంటి వివరాలను పూరించి రిపోర్ట్ ట్యాబ్పై క్లిక్ చేయాలి. అప్పుడు మీ స్క్రీన్పై లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది. అందులో మీరు మీ పేరును తనిఖీ చేసుకోవచ్చు.
కింది ప్రక్రియను పాటించటం ద్వారా రైతులు PM కిసాన్ పథకంలో తొలగించబడిన పేర్ల జాబితాను పరిశీలించవచ్చు..
Step 1: పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్కి లాగిన్ చేయండి.
Step 2: హోమ్ పేజీలో "డ్యాష్బోర్డ్"పై క్లిక్ చేయండి.
Step 3: రాష్ట్రం, జిల్లా, ఉప-జిల్లా, గ్రామానికి సంబంధించిన వివరాలు పూరించి "షో" పై క్లిక్ చేయండి.
Step 4: ఆధార్ స్టేటస్లో "తిరస్కరించబడింది" ఎంచుకోండి.
Step 5: పీఎం కిసాన్ సమన్ ఫండ్ తిరస్కరణలు, తిరస్కరణకు గల కారణాల గురించిన సమాచారాన్ని కలిగి ఉన్న జాబితా వస్తుంది. అందులో తిరస్కరణ కారణాలను పరిశీలించవచ్చు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications