న్యూఢిల్లీ: 2020 ఏప్రిల్ నుండి డిసెంబర్ కాలంలో ఏడాది ప్రాతిపదికన భారత మర్చంటైజ్ ఎగుమతులు 15.5% క్షీణించాయి. అదే సమయంలో వ్యవసాయ ఉత్పత్తులు మాత్రం 9.8% పెరిగాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఏడాది ఎగుమతులు, దిగుమతులపై భారీ ప్రభావం పడింది. ఈ క్లిష్ట సమయంలో వ్యవసాయంపై ప్రభావం పడలేదు. పైగా వృద్ధికి వ్యవసాయ వృద్ధి దోహదపడింది. ఏప్రిల్-డిసెంబర్ కాలంలో కామర్స్ మినిస్ట్రీ ఎగుమతుల జాబితా ప్రకారం అగ్రి ఎగుమతులు పెరిగాయి.

వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల ఇలా
2020 ఏప్రిల్-డిసెంబర్ కాలంలో మొత్తం ఎగుమతులు 201.30 బిలియన్ డాలర్లుగా నమోదయింది. 2019లో ఇదే కాలంలో 238.27 బిలియన్ డాలర్లుగా ఉంది. అదే సమయంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 2019లోని 26.34 బిలియన్ డాలర్ల నుండి 28.91 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. దిగుమతులు 5.5 శాతం తగ్గడంతో, అగ్రికల్చర్ ట్రేడ్ సర్ప్లస్ 2019 ఏప్రిల్-డిసెంబర్ కాలంలో 9.57 బిలియన్ డాలర్లు కాగా, 2020 అదే కాలంలో 13.07 బిలియన్ డాలర్లకు పెరిగింది.

ప్రపంచ ధరలకు అనుగుణంగా
వ్యవసాయ ఎగుమతుల పెరుగుదల ఎక్కువగా ప్రపంచ ధరలకు అనుగుణంగా ఉంటుంది. ఐక్య రాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ గురువారం తాజా ఆహార ధరల సూచీ (FPI)ని జనవరి నెలకు గాను విడుదల చేసింది. 2014-2016 సంవత్సరాల కాలాన్ని ఆధారంగా చేసుకొని 100 పాయింట్లకు ఇచ్చారు. దీని ప్రకారం మే 2020 - జనవరి 2021 మధ్య 113.3 పాయింట్లుగా ఉంది. ఇప్పటి వరకు 2014 జూలైలో 116.4 పాయింట్లు అధికం. ఆ తర్వాత ఇదే గరిష్టం. FPI 48 నెలల కనిష్ట స్థాయి నుండి 78 నెలల గరిష్టానికి పెరిగింది.

ఎగుమతులు క్రమంగా జంప్
గత కొన్నేళ్ళుగా దేశీయ వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతున్నాయి. 2003-04 నుండి 2013-14 కాలంలో ఎగుమతులు 7.53 బిలియన్ డాలర్ల నుండి 43.25 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2015-16 కాలంలో ఎగుమతులు 32.81 బిలియన్ డాలర్లు కాగా, 2018-19 నాటికి 39.20 బిలియన్ డాలర్లకు చేరాయి. 2019-20 కాలంలో ఇవి 35.60 బిలియన్ డాలర్లకు తగ్గాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications