టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందింది అంటే అరచేతిలో ఉండే ఫోన్ ద్వారా ఏదైన చిటికెలో చేసేయొచ్చు. అయితే అదే టెక్నాలజీతో పాటు సైబర్ మోసాలు కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త పద్ధతులలో పుట్టుకోస్తున్నాయి. సైబర్ నేరాల గురించి మనం తరచుగా వార్తల్లో వింటుంటాం... కానీ ఊహించని విధంగా టెక్నాలజీని ఉపయోగించి జనాల్ని మోసం చేస్తున్న ఓ బడా స్కాంని పోలీసులు ఛేదించారు. విషయం ఏంటంటే హైదరాబాద్లోని హై-టెక్ సిటీలో ఒక ఆఫీసు నుండి పనిచేస్తూ అమెరికాలోని అంతర్జాతీయ ఆన్లైన్ పేమెంట్ యాప్ పేపాల్ కస్టమర్లను మోసం చేస్తున్న నకిలీ కాల్ సెంటర్ను సైబరాబాద్ పోలీసులు గుట్టురట్టు చేశారు.
ఎగ్జిటో సొల్యూషన్స్ అనే కంపెనీ పేరుతో నడిపిస్తున్న ఈ ఫేక్ కాల్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ చందా మనస్వినితో సహా 63 మందిని గురువారం అరెస్టు చేశారు. అయితే, ప్రధాన నిందితుడు గుజరాత్ నివాసి కైవన్ పటేల్ రూపేష్ కుమార్ పరారీలో ఉన్నాడు. ఈ ఫేక్ కంపనీ టెలికాలర్లు ప్రవాస భారతీయులు (NRIs), అమెరికన్లను టార్గెట్ చేసుకోని మోసాలు చేస్తున్నారు. ఒక సమాచారం ఆధారంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) సిబ్బంది బుధవారం రాత్రి ఈ నకిలీ కాల్ సెంటర్లో సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా నార్త్ స్టేట్స్ చెందిన అరవై మూడు మందిని ఈ ఫేక్ కాల్ సెంటర్ సంస్థలో పనిచేస్తున్నారని, NRIలు, US పౌరులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని కనుగొంది.

అయితే నిందితులు ఎగ్జిటో సొల్యూషన్స్ను ప్రారంభించడం ద్వారా పేపాల్ కస్టమర్ కేర్ ప్రతినిధులగా వ్యవహరిస్తున్నారు. EYEBEAM అండ్ X-LITE వంటి లేటెస్ట్ సాఫ్ట్వేర్లను ఉపయోగించి ఫేక్ క్లాస్ చేస్తూ, ఫిషింగ్ ఇమెయిల్లు పంపుతూ అమెరికాలో ఉన్న పేపాల్ కస్టమర్లను టార్గెట్ చేస్తూ దోచుకుంటున్నారు. అయితే ఈ ఫేక్ కాల్ సెంటర్ ద్వారా బాధితులకి కస్టమర్ పేమెంట్ చేసినట్టు ట్రాన్సక్షన్ లింక్ చూపిస్తూ ఒక ఇమెయిల్ పంపుతారు. అదే ఇమెయిల్లో పేపాల్ కస్టమర్ కేర్ కాంటాక్ట్ నంబర్ పేర్కొంటూ ఒక నంబర్ పంపిస్తారు. బాధితులు అలంటి ట్రాన్సక్షన్ చేయలేదని తెలుసుకొని ఇమెయిల్కు స్పందించి ఇచ్చిన కస్టమర్లు ఫోన్ నంబర్కు కాల్ చేస్తారు. ఈ ఫేక్ కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్లు బాధితులతో మాట్లాడి ఆపై వారిని తప్పుదారి పట్టించడం ద్వారా బాధితుల నుండి డబ్బును స్వాహా చేస్తున్నారు. ఈ విధమైన మోసాలు OTP మోసాలలానే జరుగుతాయని పోలీసులు తెలిపారు.
ఈ స్కామ్ ప్రధాన నిందితుడు కైవన్ పటేల్ రూపేష్ కుమార్ దుబాయ్లో నివసిస్తున్న అతని అన్నయ్య విక్కీ, సహచరుడు అజాద్తో కలిసి ఈ రాకెట్ నిర్వహిస్తున్నారు. వీళ్ళు పేపాల్ కస్టమర్ డేటాను దొంగిలించి ఈ కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్లకి షేర్ చేస్తుంటారు. రూపేష్ అండ్ విక్కీ అమెరికాలో ఓ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి బాధితులని మోసం చేయడం ద్వారా పొందిన డబ్బు కోసం ఉపయోగించారు. ఈ అకౌంట్స్ నుండి నిందితులు డబ్బును క్రిప్టోకరెన్సీగా మార్చుకుని దానిని ఇతర అకౌంట్లోకి మళ్లిస్తుంటారు.
ఎగ్జిటో సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ చందా మనస్విని పర్యవేక్షణలో మొత్తం నెట్వర్క్ను రూపేష్ కుమార్ అండ్ రాహుల్ చూసుకుంటున్నారని దర్యాప్తులో తేలింది. బాధితులను నకిలీ పేమెంట్స్ చేసేలా తారుమారు చేయడంలో స్కిల్స్ ఉన్న టీమ్ లీడర్లు సంజు, జేమ్స్ అండ్ ప్రవీణ్లతో ఈ సంస్థ పనిచేసింది అని పోలీసులు తెలిపారు. ఈ కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్లు మొదట్లో కంపెనీ సైబర్ నేరాలకు పాల్పడుతుందని తెలియకుండానే కంపెనీలో చేరారు. కానీ కంపెనీలో చేరిన తర్వాత ప్రజల్ని మోసం చేసేందుకు వారిని ఉపయోగించుకుంటున్నారని గ్రహించారు. కానీ ఈ విషయం తెలిసినప్పటికీ కూడా నిందితులు అదే పని చేస్తూనే ఉన్నారు. అరెస్టు చేసిన కాల్ సెంటర్ ఉద్యోగులందరూ ఒకే హాస్టల్లో నివసిస్తున్నారు, వీరికి ఆఫీసు వెళ్ళడానికి క్యాబ్లను బుక్ చేసేది కంపెనీ యాజమాన్యమే. ప్రతి ఎగ్జిక్యూటివ్కు 30 మంది కస్టమర్లను మోసం చేయాలని టార్గెట్ కూడా పెట్టారు అని అధికారులు తెలిపారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications