Facebook: ప్రపంచ వ్యాప్తంగా గతంలో ఉచితంగా సేవలందించిన పలు సంస్థలు మెల్లగా ఛార్జీలు బాదుడు మొదలెట్టాయి. ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్ లో ఈ ధోరణి ఇప్పడు పెరుగుతోంది. X(గతంలో ట్విట్టర్) పగ్గాలను అపర కుబేరుడు ఎలాన్ మస్క్ చేపట్టిన తర్వాత ఈ తరహా విధానం ఊపందుకుంది. తాజాగా మరో ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజం కూడా ఇదే బాటలో నడుస్తోంది.
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు ఉపయోగించుకునేందుకు ఛార్జీలు విధించాలని మెటా భావిస్తోంది. ఈ తరహా పెయిడ్ సర్వీస్ సబ్స్రైబర్స్కు యాడ్స్ నుంచి విముక్తి కల్పించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రకటనలతో కూడిన సేవలను మాత్రం ఎప్పటిమాదిరిగా ఉచితంగానే అందించడం కొనసాగిస్తుందని విశ్వసనీయ సమాచారం.

అయితే ఈ ఛార్జీలకు సంబంధించిన ప్లాన్లు, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనే విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ మొదటగా పెయిడ్ సర్వీసులు యూరప్లో ప్రారంభం అవుతాయని సమాచారం అందినట్లు ప్రముఖ విదేశీ మీడియా సంస్థ పేర్కొంది. డేటా ప్రైవసీ సహా ఇతర స్థానిక ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా.. ఈ సేవలకు సంబంధించి విధివిధానాలు రూపుదిద్దుకుంటున్నట్లు వెల్లడించింది.
జూలైలో యూరోపియన్ యూనియన్ అత్యున్నత న్యాయస్థానం మెటాపై కన్నెర్ర జేసింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్ ప్లాట్ఫారమ్స్.. తమ యాప్స్ ద్వారా సేకరించిన డేటాను షేర్ చేసుకోవడాన్ని తప్పుపట్టింది. పర్సనల్ యాడ్స్ కోసం అంగీకరించాల్సిందిగా వినియోగదారులను బలవంతం చేసిందనే అభియోగంతో.. ఐరిష్ నియంత్రణ సంస్థలు మెటాపై 390 మిలియన్ యూరోల జరిమానా కూడా విధించాయి. ఈ క్రమంలో పెయిడ్ సర్వీస్ తీసుకొచ్చే ముందు కంపెనీ ఆచితూచి అడుగులు వేస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications