Cashless Payments: గడిచిన దశాబ్ధ కాలంలో భారత్ ఎన్నో విజయాలను సాధించింది. భౌతికంగా కరెన్సీతో చెల్లింపులు చేసే విధానం నుంచి రెప్పపాటులో నగదు రహిత పేమెంట్స్ స్థాయికి ఎదిగింది. అభివృద్ధి చెందిన దేశాలకు సైతం సాధ్యం కాని ఎన్నో మైలురాళ్లను అందుకుంది.
భారతీయుల జీవన విధానంలో వచ్చిన మార్పుల గురించి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు సంవత్సరాలలో అమెరికా చేసే జరిపే నగదు రహిత లావాదేవీల సంఖ్యను, భారత్ కేవలం ఒక్క నెలలోనే నిర్వహిస్తుందన్నారు. నైజీరియాలోని భారతీయ కమ్యూనిటీతో సమావేశం సందర్భంగా ఆయన ఈ విధంగా స్పందించారు.

'ప్రతి భారతీయుడి జీవితం ఇప్పుడు సులభతరంగా మారిపోయింది. టెక్నాలజీ వినియోగంలో లోతైన మార్గాన్ని స్వీకరించడమే ఇందుకు కారణం. పేమెంట్స్ విషయంలో దీన్ని ప్రత్యక్షంగా చూడవచ్చు. అతికొద్ది మంది మాత్రమే ఇవాళ నగదు చెల్లింపులను చేస్తున్నారు, స్వీకరిస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికా ప్రజలు మూడేళ్లలో చేసే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ను భారత్లో కేవలం నెలరోజుల్లోనే జరుగుతున్నాయి' అని జైశంకర్ తెలిపారు.
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్ అని కేంద్ర మంత్రి కొనియాడారు. ఇండియాతో వ్యాపారం చేయాలని పలు దేశాలు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఫలితంగా ఎన్నడూ లేని స్థాయిలో దేశంలోకి పెట్టుబడుల ప్రవాహం వచ్చి చేరుతుందన్నారు. సవాళ్లను ఎదుర్కొంటూనే బలమైన ఆర్థిక పనితీరును ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించారు.
కొవిడ్-19 కట్టడి విషయంలో భారత్ వ్యవహరించిన విధానాన్ని జైశంకర్ ప్రశంసించారు. 2020లో జరిగిన ఓ వర్చవల్ సమావేశంలో కరోనా ధాటికి ఇండియా విలవిల్లాడటం ఖాయమని పలు దేశాలు బాహాటంగానే కామెంట్స్ చేసినట్లు చెప్పారు. అయితే ఎవరూ ఊహించని రీతిలో తట్టుకుని నిలబడటమే కాకుండా ప్రపంచ దేశాలకు టీకాలను అందించి ఆదుకున్నట్లు గుర్తుచేశారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications