రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఈ సంవత్సరం వడ్డీ రేట్లు పెంచకపోవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. 2024 ప్రారంభంలో రేట్లను తగ్గించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో రేట్ల కోత ప్రారంభమవుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో చివరి పాలసీ సమీక్ష మినిట్స్ను విడుదల చేసిన తర్వాత, ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ వడ్డీ రేట్లను యథాతథ స్థితిలో ఉంచి అందరినీ ఆశ్చర్యపరిచింది.
గత సంవత్సరం మే నుంచి 2.50 శాతం రెపో రేటు పెంచింది. అధిక ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి వడ్డీ రేట్లు పెంచింది. అయితే "ఆర్బిఐ ఈ సంవత్సరం రేట్లను యథాతథంగా ఉంచుతుందని. మార్చి 2024తో ముగిసే త్రైమాసికంలో పాలసీ రేట్లను 0.25 శాతం తగ్గిస్తుంది" అని విదేశీ బ్రోకరేజ్ HSBC ఆర్థికవేత్తలు ఒక నోట్లో తెలిపారు. 4 శాతం ద్రవ్యోల్బణం లక్ష్యం సమీప భవిష్యత్తులో కనుచూపు మేరలో లేదని, ఆర్బిఐ తక్కువ వృద్ధి రేటుతో దానిని సాధించాలనుకోదని నోట్ జోడించింది.

ఏప్రిల్ MPC సమావేశం మినిట్స్ ద్రవ్యోల్బణం దృక్పథంపై సభ్యుల పెరిగిన ఆందోళనలను హైలైట్ చేశాయని దేశీయ బ్రోకరేజ్ కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ పేర్కొంది. ద్రవ్యోల్బణం 5 శాతం కంటే ఎక్కువగానే కొనసాగుతుంది కాబట్టి FY24లో సుదీర్ఘ విరామం ఉంటుందని పేర్కొంది. "ఏప్రిల్లో విరామం అయిష్టంగానే ఉందని, ఇతర MPC సభ్యులు హైకింగ్ సైకిల్కు ముగింపు పలకడం చాలా తొందరగా ఉందని, జూన్లో విరమణ ఉంటుందని RBI గవర్నర్ శక్తికాంత దాస్తో అంగీకరిస్తున్నట్లు మినిట్స్ సూచిస్తున్నాయి" జపాన్ బ్రోకరేజీ నోమురా తెలిపింది.
"జూన్ తర్వాత, ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గుతుందని మేము భావిస్తున్నప్పటికీ, వృద్ధిలో మరింత గణనీయమైన నిరాశను మేము ఆశిస్తున్నాము. ఈ అక్టోబరు నుంచి 0.75 శాతం రేట్ల కోతపై మేము మా అభిప్రాయాన్ని కొనసాగిస్తున్నాము" అని పేర్కొంది.


Click it and Unblock the Notifications