పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల సామాన్యుడిపై మోయలేని భారంగా మారిన తరుణంలో.. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.10 చొప్పున తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం పరోక్షంగా దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపుతోంది. ఈ నిర్ణయం ప్రజలకు తక్షణ ఉపశమనం కలిగించినప్పటికీ.. ప్రభుత్వ ఖజానాకు మాత్రం భారీ కోతను మిగిల్చింది.
ఈ పన్ను తగ్గింపు వల్ల కేంద్ర ప్రభుత్వం ఏటా సుమారు రూ.1.15 లక్షల కోట్ల నుండి రూ.1.8 లక్షల కోట్ల వరకు ఆదాయాన్ని కోల్పోతుందని అంచనా. ఒక దేశ బడ్జెట్లో ఇది ఎంత పెద్ద మొత్తం అంటే, రైతులకు ఇచ్చే పీఎం-కిసాన్ పథకం నిధుల కంటే ఇది రెట్టింపు, అలాగే దేశ విద్యా రంగానికి కేటాయించే వార్షిక బడ్జెట్తో ఇది సమానంగా ఉంది.
సీబీఐసీ ఛైర్మన్ వివేక్ చతుర్వేది తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నిర్ణయం 15 రోజుల్లో సుమారు రూ. 7,000 కోట్ల ఆదాయ నష్టం కలిగించవచ్చని అంచనా వేశారు. ఈ చర్య, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధాల నేపథ్యంలో.. చమురు కంపెనీల నష్టాలను తగ్గించి, దేశీయంగా డీజిల్, ఏటీఎఫ్ (ATF) సరఫరా నిలకడగా ఉండేలా సహాయపడుతుంది.

ఎక్సైజ్ సుంకం తగ్గింపు ముఖ్యంగా వినియోగదారుల ఇంధన ధరలు పెరగకుండా రక్షించడానికి, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల వసూళ్లలో లోటు తగ్గించడానికి ఉద్దేశించబడింది. చతుర్వేది వివరించినట్లు, ప్రభుత్వం డీజిల్పై లీటరుకు రూ. 21.5, ఏటీఎఫ్పై లీటరుకు రూ. 29.5 ఎగుమతి సుంకాలు విధించింది. ఈ అదనపు సుంకాల ద్వారా, 15 రోజుల్లో ప్రభుత్వం రూ.1,500 కోట్ల ఆదాయం సమకూర్చగలదు.
పరిశ్రమ అంచనాల ప్రకారం.. ఎక్సైజ్ సుంకం తగ్గింపు ఏటా సుమారు రూ. 1.75 లక్షల కోట్ల నష్టం కలిగించవచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక సోషల్ మీడియా పోస్టులో తెలిపారు.ఎక్సైజ్ సుంకం తగ్గించడం వినియోగదారులకు ధరల పెరుగుదల నుండి రక్షణ కల్పిస్తుంది. ప్రభుత్వం ఎల్లప్పుడూ నిత్యావసర వస్తువుల సరఫరా, ధరల స్థిరత్వం కోసం చర్యలు తీసుకుంటుందన్నారు.
ఈ ఆదాయ నష్టం వల్ల ప్రభుత్వం ప్రధానంగా ద్రవ్యలోటు (Fiscal Deficit) ముప్పును ఎదుర్కొంటోంది. ఆదాయం తగ్గి, ఖర్చులు పెరగడం వల్ల ద్రవ్యలోటు సుమారు 0.3 శాతం పెరిగే అవకాశం ఉంది. మరోవైపు, ఎరువులపై ఇస్తున్న సబ్సిడీ ఖర్చులు పెరుగుతుండటం ప్రభుత్వానికి మరిన్ని ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. ప్రజలకు ధరల నుండి ఉపశమనం కలిగించాలా లేక దేశ వృద్ధిని కొనసాగించాలా అనే 'ద్వంద్వ సవాలు' మధ్య ప్రభుత్వం ప్రస్తుతం కొట్టుమిట్టాడుతోంది.
ఈ భారీ ఆర్థిక లోటును పూడ్చుకోవడానికి ప్రభుత్వం కేవలం పొదుపు చర్యల మీద మాత్రమే ఆధారపడలేకపోతోంది. అందుకే, ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతోంది. గతంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు 'ఆయిల్ బాండ్ల' ద్వారా అప్పులు చేసేవారు, కానీ ఆ భారం దేశంపై చాలా కాలం ఉంటుంది. అందుకే ప్రస్తుత ప్రభుత్వం డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ఎగుమతులపై కొత్త పన్నులను విధించింది. ఎగుమతి చేసే డీజిల్పై లీటరుకు రూ.21.5, ఏటీఎఫ్ పై రూ.29.5 పన్ను విధించడం ద్వారా కొంత ఆదాయాన్ని సమకూర్చుకోవాలని చూస్తోంది.
అంతేకాకుండా.. ప్రభుత్వం వద్ద ఉన్న ఉపయోగించని ఆస్తులను దీర్ఘకాలిక లీజుకు ఇవ్వడం (Asset Monetization) ద్వారా నిధులు సమీకరించే ప్రక్రియను వేగవంతం చేసే అవకాశం ఉంది. ఇంధన ధరల నియంత్రణ మరియు ఆర్థిక స్థిరత్వం మధ్య సమతుల్యత సాధించడం అనేది ప్రభుత్వానికి ఇప్పుడు ఒక కత్తిమీద సాములా మారింది.
కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ.. గత నెలలో అంతర్జాతీయ ముడిచమురు ధరలు బ్యారెల్కు $70 నుంచి $122 కు పెరిగాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా Petrol, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ఉదాహరణకు ఆగ్నేయాసియాలో 30 నుంచి 50 శాతం.. ఉత్తర అమెరికాలో 30 శాతం, యూరప్లో 20 శాతం, ఆఫ్రికా దేశాల్లో 50 శాతం పెరుగుదల జరిగింది.
మధ్యప్రాచ్యంలో యుద్ధం 30 రోజులు పూర్తి చేసుకోగా..అంతర్జాతీయ చమురు ధరలు 50 శాతం పెరుగుతూ బ్యారెల్కు 100 డాలర్లకు పైగా చేరాయి. అంచనాల ప్రకారం ప్రస్తుత ధరల దృష్ట్యా, దేశీయంగా పెట్రోల్ ధర లీటరుకు రూ. 26, డీజిల్ ధర రూ.81.90 పెరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోల్ రూ.94.77, డీజిల్ రూ. 87.67 ధరకు లభిస్తోంది.
ఏదేమైనా ప్రభుత్వం తీసుకున్న ఎక్సైజ్ సుంకం తగ్గింపు చర్య వినియోగదారులందరికి తాత్కాలిక ఉపశమనం కల్పిస్తుంది. అదే సమయంలో, ఇది ఆయిల్ కంపెనీలకు నష్టాలను తగ్గించి, దేశీయ ఇంధన సరఫరా నిలకడగా ఉండేలా సహాయపడుతుంది. ఈ మార్పులు, అంతర్జాతీయ మార్కెట్ అస్థిరత, చమురు ధరల పెరుగుదల, గ్లోబల్ యుద్ధ పరిస్థితులను దృష్టిలో ఉంచి చేపట్టబడ్డాయి.
More From GoodReturns

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Petrol prices: పెట్రోల్, డీజిల్పై రూ. 10 పన్ను తగ్గింపు.. అయినా సామాన్యులకు ఊరట లేదు! ఏందుకంటే..

LPG సిలిండర్ల కొరత ఉందా? అసలు నిజం చెప్పిన ప్రభుత్వం.. సోషల్ మీడియా వార్తలను నమ్మకండి!

Hyderabad: హైదరాబాద్లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

LPG: భారత్కు కొత్త తలనొప్పి.. ఆ భారీ రిఫైనరీ మూసివేత! ఇక తిప్పలు తప్పవా?

ఇరాన్ యుద్ధం.. దేశంలో అత్యవసర పరిస్థితి విధింపు.. ఆర్థిక స్థిరత్వం కోసం ఫిలిప్పీన్స్ కీలక నిర్ణయం..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!



Click it and Unblock the Notifications
