న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో జీఎస్టీ వసూళ్లు తగ్గి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు పడిపోయాయి. అయితే పెట్రోల్, డీజిల్ ద్వారా వచ్చే ఆదాయం మాత్రం పెరిగింది. ఇందుకు ప్రధాన కారణం పెట్రోలియం ఉత్పత్తులపై విధించే ఎక్స్చైజ్ సుంకం. కరోనా కారణంగా అంతకుముందు ఏడాది కంటే అమ్మకాలు క్షీణించాయి. కానీ వసూళ్లు మాత్రం పెరగడం గమనార్హం. అమ్మకాలు తగ్గినప్పటికీ గత ఏడాది ఎక్సైజ్ సుంకం పెంచడంతో పెట్రోలియం ఉత్పత్తుల ఆదాయం పెరిగింది.

డీజిల్ అమ్మకాలు...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2020 ఏప్రిల్-నవంబర్ మధ్య ఎక్సైజ్ సుంకం ద్వారా కేంద్రానికి రూ.1,96,342 కోట్ల మేర ఆదాయం వచ్చింది. అంతకు ముందు ఇదే కాలంలో రూ.1,32,899 కోట్లుగా ఉంది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ డేటా వెల్లడిస్తోంది. దేశంలో ఎక్కువగా వినియోగించే డీజిల్ వాడకం సుమారు 10 మిలియన్ టన్నులు తగ్గింది. కానీ ఆదాయం మాత్రం భారీగా పెరిగింది. 2019 ఏప్రిల్-నవంబర్ సమయంలో 55.4 మిలియన్ టన్నుల డీజిల్ అమ్మకాలు నమోదు కాగా, 2020లో ఇదే సమయంలో కేవలం 44.9 మిలియన్ టన్నుల డీజిల్ అమ్మకాలు నమోదయ్యాయి.

పెట్రోల్ అమ్మకాలు
పెట్రోల్ 2019లో 20.4 మిలియన్ టన్నులు సేల్ కాగా, 2020లో 17.4 మిలియన్ టన్నుల విక్రయాలు మాత్రమే జరిగాయి. ఈ మేరకు చమురు మంత్రిత్వ శాఖకు చెందిన ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ (PPAC) డేటా వెల్లడిస్తోంది. ప్రభుత్వం గత ఏడాది లీటర్ పెట్రోల్ పైన రూ.13 ఎక్సైజ్ డ్యూటీని, డీజిల్ పైన రూ.16ను పెంచింది. ఈ మొత్తాన్ని మార్చి, మే నెలల్లో రెండు పర్యాయాల్లో పెంచింది. దీంతో పెట్రోల్ పైన ఎక్సైజ్ డ్యూటీ రూ.32.98కి, డీజిల్ పైన రూ.31.83కు పెరిగింది.

జీఎస్టీ నుండి మినహాయింపు
2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత పెట్రోలియం, సహజవాయువు ఉత్పత్తుల్ని ఈ పన్ను విధానం నుంచి మినహాయించారు. వీటిపై విధించే ఎక్సైజ్ పన్ను ద్వారా కేంద్రానికి, వ్యాట్ ద్వారా రాష్ట్రాలకు ఆదాయం వస్తోంది. ఈ క్రమంలో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు రెండు దశాబ్దాల కనిష్ఠానికి చేరడంతో గత ఏడాది కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని సవరించింది.
More From GoodReturns

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

LPG సిలిండర్ల కొరత ఉందా? అసలు నిజం చెప్పిన ప్రభుత్వం.. సోషల్ మీడియా వార్తలను నమ్మకండి!

LPG: భారత్కు కొత్త తలనొప్పి.. ఆ భారీ రిఫైనరీ మూసివేత! ఇక తిప్పలు తప్పవా?

హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

ఇరాన్ యుద్ధం.. దేశంలో అత్యవసర పరిస్థితి విధింపు.. ఆర్థిక స్థిరత్వం కోసం ఫిలిప్పీన్స్ కీలక నిర్ణయం..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!



Click it and Unblock the Notifications