Bus ticket for 99: పెరుగుతున్న జనాభాకు సరిపడే స్థాయిలో రవాణా సౌకర్యాలు ఉండటం లేదు. వివిధ నగరాల మధ్య బస్సు సర్వీసులకు మంచి డిమాండ్ ఉండటంతో పలు సంస్థలు ఈ విభాగంలోకి ప్రవేశిస్తున్నాయి. సాంప్రదాయ డీజిల్ వాహనాల స్థానంలో కొత్త తరం ఇంధన వనరులతో కూడిన ఎలక్ట్రిక్ బస్సులను పరిచయం చేస్తున్నాయి. తాజాగా ఓ యూరోపియన్ బస్సు ఆపరేటర్ దక్షిణ భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చింది. వచ్చీ రావడంతోనే గొప్ప ఆఫర్ అందిస్తోంది.
సౌత్ ఇండియాలోకి కొత్తగా ప్రవేశించిన 'ఫ్లిక్స్ బస్' సంస్థ కేవలం 99 కే పలు నగరాలకు ప్రయాణ సౌకర్యాన్ని ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 15 వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. FlixBus యాప్ మరియు వెబ్సైట్లో టిక్కెట్ బుక్ చేయడం ద్వారా సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 6 మధ్య అన్ని గమ్యస్థానాలకు 99 కే ప్రయాణించడానికి వీలు కలుగుతుంది.

ఈ బస్సు సర్వీసులు చెన్నై, హైదరాబాద్, బెళగావి, కోయంబత్తూర్, మధురై మరియు విజయవాడలకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. కాగా త్వరలోనే ఇతర గమ్యస్థానాలకు సైతం తమ సేవలను విస్తృత పరచనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు బెంగళూరులో ఫ్లిక్స్బస్ సేవలను పరిశ్రమలు మరియు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి MB పాటిల్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రస్తుతం 12 బస్సులతో ఈ కొత్త ఆపరేటర్ జర్నీ స్టార్ట్ చేసి 99 కే పరిమిత కాల ఆఫర్ లాంచ్ చేసింది.
టెక్ ఆధారిత ట్రావెల్ మోడల్ మరియు కస్టమర్-సెంట్రిక్ విధానంతో ఇంటర్సిటీ ట్రావెల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే తమ లక్ష్యమని యాజమాన్యం చెబుతోంది. యూనివర్సల్ బస్ సర్వీసెస్, జగన్ ట్రావెల్స్, అన్నే ట్రావెల్స్, జై శ్రీ ట్రావెల్స్, సమన్వి ట్రావెల్స్ మరియు వరుణ్ ట్రావెల్స్తో సహా 6 స్థానిక ట్రావెల్ ఆపరేటర్లతో ఫ్లిక్స్ బస్ భాగస్వామ్యం కలిగి ఉన్నట్లు తెలిపారు. కొత్త బస్సులను ప్రకాష్ కోచ్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు అశోక్ లేలాండ్ తయారుచేశాయి.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications