పీఎఫ్ డబ్బులు తీసుకునే కష్టాలకు చెక్.. యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే డబ్బులు మీ అకౌంట్లోకి..

దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 8 కోట్ల మంది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సభ్యులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అయింది. పీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులు ఉపసంహరించుకునే ప్రక్రియను మరింత వేగవంతం, సులభతరం చేయాలనే లక్ష్యంతో యూపీఐ (Unified Payments Interface) ఆధారిత విత్‌డ్రా విధానాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కొత్త విధానం 2026 ఏప్రిల్ నాటికి అమల్లోకి రానుంది.

ప్రస్తుతం ఈపీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు తీసుకోవాలంటే క్లెయిమ్ ఫారమ్‌లు సమర్పించడం, ఆధార్-బ్యాంకు లింకింగ్, ధృవీకరణ వంటి అనేక దశలను పూర్తి చేయాల్సి వస్తోంది. ఈ ప్రక్రియకు సాధారణంగా కొన్ని రోజులు, కొన్ని సందర్భాల్లో వారాలు కూడా పడుతోంది. అయితే యూపీఐ ఆధారిత వ్యవస్థ అమల్లోకి వస్తే ఈ మొత్తం ప్రక్రియ చాలా సులభంగా మారనుంది. సభ్యులు తమ పీఎఫ్ ఖాతాకు అనుసంధానమైన బ్యాంకు ఖాతాకు యూపీఐ పిన్ ఉపయోగించి నేరుగా డబ్బులు బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది.

EPFO EPFO reform PF withdrawal via UPI UPI PF withdrawal EPF UPI withdrawal April 2026 EPFO digital services provident fund withdrawal EPF online withdrawal EPFO latest news PF withdrawal rules India EPFO UPI integration employee provident fund India EPF claim settlement EPFO fintech reform UPI payments PF 2026

ఈ కొత్త విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ఈపీఎఫ్‌వో ప్రస్తుతం తన ఐటీ మౌలిక సదుపాయాల్లో కీలక మార్పులు చేస్తోంది. అవసరమైన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, భద్రతా ప్రమాణాల అమలు, బ్యాంకులు-యూపీఐ నెట్‌వర్క్‌తో సమన్వయం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దీని వల్ల పీఎఫ్ క్లెయిమ్‌ల ప్రాసెసింగ్ సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికే ఈపీఎఫ్‌వో ఆటో-సెటిల్‌మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టి సభ్యులకు మరింత సౌలభ్యం కల్పిస్తోంది. అనారోగ్యం, విద్య, వివాహం, గృహ నిర్మాణం వంటి అవసరాల కోసం చేసే పాక్షిక ఉపసంహరణ క్లెయిమ్‌లను మూడురోజుల్లోనే పరిష్కరిస్తున్నారు. ఈ విధానంలో గరిష్ట పరిమితిని గతంలో ఉన్న రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచడం ద్వారా సభ్యులకు మరింత ఆర్థిక స్వేచ్ఛను కల్పించారు.

అలాగే.. పీఎఫ్ పాక్షిక ఉపసంహరణ నిబంధనలను కూడా ఈపీఎఫ్‌వో సరళీకరించింది. గతంలో ఉన్న 13 సంక్లిష్ట నియమాలను తొలగించి, వాటిని మూడు సులభమైన కేటగిరీలుగా విభజించింది. దీని వల్ల సభ్యులు తాము అర్హత కలిగిన మొత్తాన్ని సులభంగా అర్థం చేసుకుని విత్‌డ్రా చేసుకునే అవకాశం ఏర్పడింది.

కొత్త నిబంధనల ప్రకారం.. సభ్యులు తమ EPFO ఖాతాలో ఉన్న అర్హత బ్యాలెన్స్‌లో 100 శాతం వరకు ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. అయితే, దీర్ఘకాలిక ఆర్థిక భద్రత దృష్ట్యా కనీసం 25 శాతం మొత్తాన్ని ఖాతాలో కొనసాగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే పీఎఫ్ ఖాతాపై ప్రస్తుతం 8.25 శాతం వడ్డీ రేటు వర్తిస్తుండటంతో పాటు చక్రవడ్డీ ప్రయోజనాలు కూడా అందుతాయి. యూపీఐ ఆధారిత సేవలు అందుబాటులోకి వస్తే ఈపీఎఫ్‌వో సేవలు బ్యాంకింగ్ స్థాయికి చేరుకుంటాయని అధికారులు భావిస్తున్నారు. ప్రతి సంవత్సరం వచ్చే 5 కోట్లకు పైగా పీఎఫ్ క్లెయిమ్‌ల ప్రాసెసింగ్ భారం కూడా గణనీయంగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+