EPFO చందాదారులకు గుడ్న్యూస్. ఈ-నామినేషన్ దాఖలు చేసే గడువును ఈపీఎఫ్ఓ పొడిగించింది. డిసెంబర్ 31వ తేదీ తర్వాత కూడా ఈ నామినేషన్ దాఖలు చేసే అవకాశం కల్పించింది. సబ్స్క్రైబర్లు సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివరాలను జత చేసే ప్రయత్నాలు చేసిన సందర్భంలో ఈపీఎఫ్ఓ పోర్టల్ సర్వర్ డౌన్ సమస్యగా మారింది. దీంతో పలువురు వినియోగదారులు ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న అనంతరం డిసెంబర్ 31వ తేదీ తర్వాత నామినీ వివరాలను అప్ డేట్ చేసే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది.

ఈ-నామినేషన్ దాఖలు చేస్తే..
EPFO ప్రకారం ఒక వ్యక్తి ఈ-నామినేషన్ను దాఖలు చేయాలి. ఎందుకంటే ఇది సభ్యుని మరణం తర్వాత పెన్షన్ (ఎంప్లాయీస్ డిజిటల్ లింక్డ్ ఇన్సురెన్స్ స్కీమ్), ప్రావిడెంట్ ఫండ్(PF), ఇన్సురెన్స్ (ఉద్యోగుల డిజిటల్ లింక్డ్ ఇన్సురెన్స్ స్కీమ్) ప్రయోజనాలను సులభంగా పొందడంలో ఉపయోగపడుతుంది. ఆన్ లైన్ క్లెయిమ్స్ ఫైల్ చేయడానికి నామినీని ఎనేబుల్ చేయాలి.
EPFO సబ్స్క్రైబర్లు తమ కుటుంబాలకు సామాజిక భద్రతను అందించేందుకు ఈ-నామినేషన్ను దాఖలు చేయడం మంచిది. నామినేషన్ డిజిటల్గా దాఖలు చేయడానికి కింది దశలను అనుసరించాలి. సబ్స్క్రైబర్లు ఒకటి కంటే ఎక్కువసార్లు పీఎఫ్ నామినీని జత చేయవచ్చు. ఈపీఎఫ్ నామినేషన్ ఆన్లైన్లో దాఖలు చేసిన తర్వాత ఇందుకు సంబంధించిన పత్రాలను నేరుగా ఇవ్వాల్సిన అవసరం లేదు.

పీఎఫ్ నామినేషన్ దాఖలు ఇలా..
- మొదట epfindia.gov.in లో లాగ్-ఇన్ కావాలి.
- సర్వీసెస్ సెక్షన్కి వెళ్లి ఫర్ ఎంప్లాయీస్(For Employees) బటన్ పైన క్లిక్ చేయండి.
- ఆ తర్వాత మెంబర్ యూఏఎన్ లేదా ఆన్లైన్ సర్వీసెస్ (ఓసీఎస్/ఓటీసీపీ) బటన్ పైన క్లిక్ చేయాలి.
- మీ UAN, పాస్వర్డ్తో లాగ్-ఇన్ కావాలి.
- మేనేజ్ బటన్ కింద ఈ-నామినేషన్(E-Nomination) సెలెక్ట్ చేయండి.
- మీ ఫ్యామిలీ డిక్లరేషన్ అప్డేట్ కోసం Yesపై క్లిక్ చేయండి.
- యాడ్ ఫ్యామిలీ డీటెయిల్స్ బటన్ పైన క్లిక్ చేసి వివరాలు ఇవ్వాలి.
- పీఎఫ్ మొత్తంలో ఎవరెవరికి ఎంత ఎంత మొత్తం ఇవ్వాలో తెలియజేయడానికి .నామినేషన్ డిటెయిల్స్ పైన క్లిక్ చేయాలి.
- డిక్లరేషన్ ఇచ్చాక సేవ్ ఈపీఎఫ్ నామినేషన్ పైన క్లిక్ చేయండి.
- ఓటీపీ కోసం E-Sign బటన్ పైన క్లిక్ చేయాలి.
- ఆధార్ కార్డుతో లింక్ చేసిన మీ మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది.
- ఓటీపీని నమోదు చేస్తే ఈపీఎఫ్లో మీ ఈ-నామినేషన్ నమోదు ప్రక్రియ పూర్తవుతుంది.

అక్టోబర్ సబ్స్క్రైబర్లు
ఇదిలా ఉండగా, అక్టోబర్ నెలలో ఈపీఎఫ్ఓకు 12.73 లక్షల సబ్స్క్రైబర్లు జత కలిశారు. గత ఏడాది అక్టోబర్ నెలతో పోలిస్తే ఇది 10.22 శాతం ఎక్కువ. ఈపీఎఫ్ పేరోల్ డేటా 20 డిసెంబర్ 2021న విడుదలైంది. 12.73 లక్షల నెట్ సబ్స్క్రైబర్లలో 7.57 లక్షల మంది కొత్త వారు.
More From GoodReturns

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications