EPF: భవిష్యత్ ఆర్థిక అవసరాల గురించి ఆలోచించే ధోరణి ఈమధ్య ఉద్యోగుల్లో విపరీతంగా పెరుగుతోంది. వచ్చిన జీతాన్ని వెంటనే ఖర్చు చేసే అలవాటు నుంచి క్రమంగా పొదుపు, పెట్టుబడి వంటి పలు మార్గాల అన్వేషణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రభుత్వం కూడా వారిని ప్రోత్సహించేందుకు పలు పథకాలను అమలు చేస్తోంది.
నిబంధనలు ప్రకారం ప్రావిడెంట్ ఫండ్ కింద నమోదైన ఉద్యోగుల వేతనాల్లో కొంత మొత్తం EPF కింద కోత విధించబడుతుంది. ఇందుకు అదనంగా అంతే మొత్తాన్ని యజమాని సైతం పే చేయాల్సి ఉంది. ఈ టోటల్ అమౌంట్ లో కొంత భాగం సేవింగ్స్ కాగా మరికొంత పెన్షన్ కింద నెలనెలా జమ అవుతుంది. ఉద్యోగికి 60 ఏళ్లు వచ్చినప్పటి నుంచి వారికి ఈ పింఛను బెనిఫిట్ లభిస్తుంది.

కావాలంటే ఈ పింఛను అమౌంట్ మొత్తాన్ని పెంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అధిక పెన్షన్ కోసం యజమానులు తమ ఉద్యోగుల వివరాలను అప్ లోడ్ చేయడానికి గడువును EPFO తాజాగా పెంచింది. డిసెంబర్ 31 వరకు మరో అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయర్స్, ఎంప్లాయర్స్ అసోసియేషన్ల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు గడువు పొడిగించినట్లు కార్మిక శాఖ తెలిపింది.
సెప్టెంబర్ 29 నాటికి అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న 5.52 లక్షల అప్లికేషన్స్ యజమానుల వద్ద పెండింగ్ లో ఉన్నట్లు లేబర్ మినిస్ట్రీ వెల్లడించింది. అందుకే మరో 3 నెలల సమయం ఇచ్చినట్లు చెప్పింది. ఇలా గడువు తేదీని పొడిగించడం ఇప్పటి వరకు మూడోసారి కావడం విశేషం.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications