EPFO ఉద్యోగులకు బోనస్ కిక్కు.. సంతోషంలో సంబురాలు.. ఎలా లెక్కిస్తారంటే..
EPFO Bonus: పండక్కి ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్ రావటం సహజమే. అయితే అది ఎంత అనేదే చాలా కీలకమైనది. తాజాగా మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ పరిధిలోని EPFO అర్హత కలిగిన గ్రూప్- సి, గ్రూప్- బి ఉద్యోగులకు ఉత్పాదకత లింక్డ్ బోనస్ ప్రకటించింది.
60 రోజుల బోనస్..
2022 దీపావళికి కొద్ది రోజుల ముందు ప్రకటన వెలువడింది. దీని కింద ఒక్కో ఉద్యోగి దాదాపు రూ.14 వేల వరకు క్యాష్ బోనస్ పొందుతారని EPFO పేర్కొంది. సదరు ఉద్యోగులకు 60 రోజుల వేతనానికి సమానమైన బోనస్ పొందుతారని తెలుస్తోంది.
అర్హతలు..
2021-22 సంవత్సరానికి PLB అడ్వాన్స్ మొత్తాన్ని 20.10.2022 నాటికి అర్హులైన ఉద్యోగులకు చెల్లించవచ్చని EPFO తెలిపింది. శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుంది. అయితే.. క్యాజువల్, కాంట్రాక్టు, ఎక్స్ట్రా డిపార్ట్మెంటల్ ఉద్యోగులు ఈ బోనస్కి అర్హులు కారు.
ఖాతాదారులకు వడ్డీ..
సబ్స్క్రయిబర్లకు వడ్డీ రూపంలో దీపావళి బహుమతిని ఈపీఎఫ్ఓ సిద్ధమైంది. FY 2021-22 వడ్డీని ఈపీఎఫ్ఓ అకౌంట్ హోల్డర్లు దీపావళికి ముందే అందనున్నట్లు తెలుస్తోంది. పీఎఫ్ అకౌంట్లో ఉన్న డబ్బులు ఆధారంగా 8.10 శాతం రేటున వడ్డీ క్రెడిట్ అవనుంది. లక్ష రూపాయలు ఖాతాలో ఉన్నవారికి రూ.8,100 వడ్డీ లభించనుంది.
కొత్త చేరికలు..
ఆగస్టు మాసంలో కొత్తగా 16.94 లక్షల మంది ఖాతాదారులను యాడ్ చేసుకున్నట్లు ఈపీఎఫ్ఓ పేరోల్ డేటా ప్రకారం వెల్లడైంది. ఇందులో 9.87 లక్షల మంది కొత్త వారు కావటం విశేషం. కొత్తవారిలో 58.32% మంది 18-25 ఏళ్ల వయస్సు ఉన్న వారేనని వెల్లడైంది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు, హర్యానా, గుజరాత్ మరియు ఢిల్లీ ఈ నెలలో దాదాపు 11.25 లక్షల మంది కొత్త ఖాతాదారులు EPFOలో చేరారు.