హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ మరోసారి దేశంలో పంజా విసురుతోంది. రోజువారీ కేసులు భారీగా నమోదవుతోన్నాయి. లక్షకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. వరుసగా రెండోరోజు కూడా దేశంలో నమోదైన మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షను దాటేసింది. శుక్రవారం నాటి బులెటిన్ ప్రకారం.. దేశంలో నమోదైన పాజిటివ్ కేసుల 1,17,096 కాగా.. ఇవ్వాళ ఈ సంఖ్య భారీగా పెరిగింది. కొత్తగా 1,41,986కు చేరింది. 285 మంది మరణించారు. 3,44,12,740 మంది రికవరీ అయ్యారు. 4,83,463 మంది మరణించారు. యాక్టివ్ కేసులు 4,72,169గా నమోదయ్యాయి.
ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం యుక్త వయస్కులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా 15 నుంచి 18 సంవత్సరాల్లోపు పిల్లలకు వ్యాక్సిన్ ఇస్తోంది. ఈ నెల 3వ తేదీన ప్రారంభించిన ఈ కార్యక్రమం జోరుగా సాగుతోంది. లక్షల సంఖ్య 15-18 సంవత్సరాల్లోపు పిల్లలు తొలి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. దీన్ని మరింత ముమ్మరం చేయడానికి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో వ్యాక్సిన్ సెంటర్లను నెలకొల్పాయి రాష్ట్ర ప్రభుత్వాలు.

ఈ వ్యాక్సినేషన్లో కోవాగ్జిన్ను మాత్రమే వినియోగించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాదీ టాప్ ఫార్మాసూటికల్స్ కంపెనీ భారత్ బయోటెక్ దీన్ని అభివృద్ధి చేసింది. ఈ కంపెనీ డెవలప్ చేసిన క్లినికల్ ట్రయల్స్ అన్నీ సవ్యంగా ఉండటం వల్ల డ్రగ్ కంట్రోలర్ జనరల్.. కోవాగ్జిన్కు మాత్రమే అనుమతి ఇచ్చింది. కొన్ని చోట్ల కోవాగ్జిన్కు బదులుగా వేరే కంపెనీకి చెందిన వ్యాక్సిన్ను 15 నుంచి 18 సంవత్సరాల్లోపు పిల్లలకు వేస్తోన్నట్లు వార్తలు వస్తోన్నాయి.
దీని పట్ల భారత్ బయోటెక్ యాజమాన్యం స్పందించింది. పిల్లల కోసం ఉద్దేశించిన వ్యాక్సినేషన్లో కోవాగ్జిన్కు మాత్రమే అనుమతి ఉందని స్పష్టం చేసింది. మరో టీకాను వినియోగించవద్దని సూచించింది. మరో కంపెనీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ వినియోగానికి ఎలాంటి అనుమతులు లేవని పేర్కొంది. కోవాగ్జిన్ను మాత్రమే వాడాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంలో హెల్త్కేర్ వర్కర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరో టీకాను వాడొద్దని తేల్చి చెప్పింది.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications