ED Raids: దేశంలో ఎడ్టెక్ రంగంలో బైజూస్ తన వ్యాపారాలను నిర్వహిస్తోంది. అయితే నేడు కంపెనీ సీఈవో, వ్యవస్థాపకుడు రవీందరన్ బైజూకి సంబంధించిన బెంగళూరులోని కార్యాలయాలు, ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (FEMA) నిబంధనల ప్రకారం రవీందరన్ బైజు, అతని కంపెనీ థింక్ & లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్' కేసులో డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్(ED) బెంగళూరులోని మూడు ప్రాంగణాల్లో సోదాలు జరిగాయి.

2011లో ప్రారంభమై 2015లో యాప్ లాంచ్ చేసిన.. ఆన్లైన్ ఎడ్యుకేషన్ పోర్టల్ బైజూస్ ఆఫీసుల్లో చేపట్టిన సోదాల్లో అధికారులు కీలక పత్రాలు, డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకున్నారు. ఎడ్-టెక్ యునికార్న్ 2011-2023 మధ్య కాలంలో సూమారు రూ.28 కోట్ల విదేశీ విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పొందినట్లు సోదాల్లో వెల్లడైంది. ఇదే కాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పేరుతో కంపెనీ దాదాపు రూ.9,754 కోట్లను విదేశాల నుంచి పొందినట్లు వివిధ శాఖలకు తెలిపింది.
బైజూ, అతని సంస్థ థింక్ & లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ అడ్వర్టైజ్మెంట్, మార్కెటింగ్ ఖర్చుల పేరుతో సుమారు రూ.944 కోట్లను ఖర్చుచేసినట్లు విదేశీ అధికార పరిధికి పంపిన వివరాల్లో వెల్లడించింది. దీనికి తోడు 2021 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ తన ఆర్థిక నివేదికలను సిద్ధం చేయలేదు. అకౌంట్స్ ఆడిట్ చేయలేదు. దీంతో ప్రైవేట్ వ్యక్తుల నుంచి వచ్చిన వివిధ ఫిర్యాదుల ఆధారంగా ప్లాట్ఫారమ్పై దర్యాప్తు చర్యలు ప్రారంభమయ్యాయి.

ఈ క్రమంలో ఈడీ దర్యాప్తులో భాగంగా బైజూస్ స్టార్టప్ వ్యవస్థాపకుడు రవీందరన్కు అనేక సార్లు సమన్లు జారీ చేసింది. అయితే వీటి నుంచి అతను తప్పించుకుంటూనే ఉన్నాడని తెలుస్తోంది. దీంతో తాజా రైడ్స్ సంచలనంగా మారాయి. విచారణ కొనసాగుతున్న క్రమంలో మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. కరోనా తర్వాత కంపెనీ భారీ నష్టాలు నమోదు చేయటం ఫండింగ్ సమస్యల కారణంగా వేల మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో గ్యాస్ కష్టాలు.. హోటళ్లు మూతపడే ప్రమాదం?

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: బడ్జెట్లో బెంగళూరు కోసం మాస్టర్ ప్లాన్..! రాబోతున్న కొత్త ప్రాజెక్టులు ఇవే!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications