IPO News: ఈరోజు మార్కెట్లోకి లిస్ట్ అయిన రెండో ఐపీవో EMS లిమిటెడ్. దాదాపు 33 శాతం ప్రీమియం ధరకు దూకుడు లిస్టింగ్ నమోదైంది. ఇన్వెస్టర్లు తొలిరోజే మంచి సంపదను పొందారు.
ఎన్ఎస్ఈలో కంపెనీ షేర్లు రూ.282.05 ధరకు లిస్ట్ అయ్యాయి. అసలు కంపెనీ ఐపీవోలో షేర్లను రూ.211 రేటుకు కేటాయించింది. 33.7 శాతం ప్రీమియం ధరకు లిస్టింగ్ కావటంతో ఇన్వెస్టర్లు ఒక్కో షేరుపై రూ.71.05 భారీ లాభాన్ని పొందారు. కంపెనీ నీటి సరఫరా, వ్యర్థ జలాల సేకరణ, శుద్ధి వ్యాపారంలో నిమగ్నమై ఉంది.

EMS IPO సెప్టెంబర్ 8- 12 వరకు సబ్స్క్రిప్షన్ కోసం తెరిచి ఉంది. ఇన్వెస్టర్ల నుంచి విశేష స్పందన రావటంతో ఐపీవో 76.21 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. EMS లిమిటెడ్ ఐపీవో రిటైల్ కోటా 30.55 సార్లు, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ కొనుగోలుదారుల(QIB) కోటా 149.98 రెట్లు, నాన్-ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా 84.39 రెట్లు సబ్స్క్రిప్షన్ను పొందింది. EMS లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ మొత్తం పరిమాణం రూ.321.24 కోట్లుగా ఉంది.
రిటైల్ ఇన్వెస్టర్లు EMS లిమిటెడ్ IPOలో కనీసం 1 లాట్, గరిష్టంగా 13 లాట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో లాటులో కంపెనీ 70 షేర్లను విక్రయించింది. అంటే ఎవరైనా కంపెనీ ఐపీవోలో పాల్గొనాలంటే కనీసం రూ.14,770 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంది. 11.46 గంటల సమయంలో కంపెనీ షేర్ ధర రూ.283.90 వద్ద కొనసాగుతోంది.
More From GoodReturns

పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. Jio IPO రెడీ అవుతోంది.. 250 మిలియన్లకు పైగా షేర్లు మార్కెట్లోకి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications