ఉద్యోగుల భవిష్య నిధి (PF) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఉపశమనాన్ని ప్రకటించింది. కొత్త నిబంధనల ప్రకారం.. ఇప్పుడు PF ఖాతాలో ఉన్న మొత్తంలో 75 శాతం వరకు ఎప్పుడైనా, ఎటువంటి కారణం చెప్పకుండానే ఉపసంహరించుకునే అవకాశం కల్పించారు. ఇది లక్షలాది మంది ఉద్యోగులకు ఆర్థికంగా ఎంతో ఉపయోగకరంగా మారనుంది.
ఇప్పటివరకు PF అంటే కేవలం పదవీ విరమణ తర్వాత మాత్రమే ఉపయోగపడే పొదుపుగా భావించేవారు. కానీ తాజా మార్పులతో PF ఇకపై అవసరమైన సమయంలో ఉద్యోగులకు తక్షణ ఆర్థిక సహాయంగా కూడా ఉపయోగపడనుంది. ఈ కీలక నిర్ణయాన్ని భారత కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఆయన ABP నెట్వర్క్ నిర్వహించిన India@2047 ఎంటర్ప్రెన్యూర్షిప్ కాన్క్లేవ్లో పాల్గొని ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు.
ఉద్యోగుల భవిష్య నిధి వ్యవస్థను మరింత సరళంగా, ఉపయోగకరంగా మార్చడమే ప్రభుత్వం లక్ష్యమని మాండవీయ తెలిపారు. ఉద్యోగులు అత్యవసర పరిస్థితుల్లో తమ సొంత డబ్బును సులభంగా పొందేలా ఈ విధానాల్లో మార్పులు తీసుకువస్తున్నామని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే PF ఉపసంహరణ నిబంధనలను సడలించినట్లు వెల్లడించారు.

ఇందులో భాగంగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన సభ్యులకు ఈ కొత్త వెసులుబాటును అందిస్తోంది. తాజా నిర్ణయం ప్రకారం.. PF ఖాతాదారులు తమ ఖాతాలో ఉన్న మొత్తంలో గరిష్టంగా 75 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు. ఇందుకు ఎటువంటి కారణం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఒకే ఒక షరతు ఉంది. కనీసం 25 శాతం మొత్తం ఖాతాలో తప్పనిసరిగా మిగిలి ఉండాలి.
ఈ నిర్ణయం EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో తీసుకున్నారు. ఈ సమావేశానికి కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షత వహించగా.. కార్మిక మంత్రిత్వ శాఖతో పాటు EPFO సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు. కొత్త నిబంధనల ప్రకారం..ఉద్యోగి తన జీతం నుంచి చెల్లించిన వాటా మాత్రమే కాకుండా, యజమాని (కంపెనీ) చెల్లించిన వాటా కూడా కలిపి 75 శాతం వరకు ఉపసంహరణకు అనుమతి ఉంటుంది. దీని వల్ల జీతం పొందే ఉద్యోగులు అవసరమైన సమయంలో తమ సొంత డబ్బును ఎలాంటి అడ్డంకులు లేకుండా పొందగలుగుతారు.
ఇంతకుముందు PF ఉపసంహరణకు చాలా కఠినమైన నిబంధనలు ఉండేవి. సాధారణంగా PF మొత్తాన్ని పదవీ విరమణ తర్వాత మాత్రమే తీసుకునే అవకాశం ఉండేది. ఒకవేళ ఉద్యోగి నిరుద్యోగిగా మారితే, ఒక నెల తర్వాత 75 శాతం మాత్రమే తీసుకునే అవకాశం ఉండేది. మిగిలిన 25 శాతం పొందాలంటే కనీసం రెండు నెలలు వేచి ఉండాల్సి వచ్చేది.
తాజా మార్పులతో PF ఖాతాదారులకు భారీ ప్రయోజనం కలగనుంది. అత్యవసర ఖర్చులు, వైద్యం, కుటుంబ అవసరాలు వంటి సందర్భాల్లో ఉద్యోగులు తమ PFను సులభంగా వినియోగించుకోగలుగుతారు. అదే సమయంలో..ఖాతాలో మిగిలే 25 శాతం మొత్తం ప్రస్తుతం ఉన్న 8.25 శాతం వార్షిక వడ్డీని సంపాదిస్తూనే ఉంటుంది. దీనివల్ల పదవీ విరమణకు అవసరమైన పొదుపులు కూడా సురక్షితంగా ఉంటాయి.
ఇక మరొక శుభవార్త ఏంటంటే.. EPFO చందాదారులు భవిష్యత్తులో తమ EPF మొత్తాన్ని ATM ద్వారా, UPI ద్వారా కూడా ఉపసంహరించుకునే విధంగా కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఇది ఉద్యోగులకు మరింత సులభతరమైన, వేగవంతమైన సేవలను అందించడమే లక్ష్యంగా రూపొందిస్తున్న చర్య అని మంత్రి పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి మాండవీయ మాట్లాడుతూ.. ప్రస్తుతం కూడా ఉద్యోగులు తమ EPF ఖాతాలోని 75 శాతం మొత్తాన్ని వెంటనే ఉపసంహరించుకోవచ్చు. దీనితో పాటు, మరింత సౌలభ్యం కోసం 2026 మార్చికి ముందే EPFను ATM ద్వారా ఉపసంహరించుకునే సదుపాయాన్ని మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టనుందని తెలిపారు. అంటే బ్యాంక్ ఖాతాల్లాగే EPF ఖాతా నుంచి కూడా నేరుగా ATM ద్వారా డబ్బు తీసుకునే అవకాశం రాబోతోంది.
ఇదే కాకుండా, EPF ఉపసంహరణ ప్రక్రియను UPIతో లింక్ చేయాలన్న యోచన కూడా ప్రభుత్వానికి ఉందని మంత్రి వెల్లడించారు. UPI ద్వారా EPF డబ్బు నేరుగా ఖాతాలోకి లేదా అవసరమైన సందర్భాల్లో తక్షణమే పొందేలా ఈ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఇది అమల్లోకి వస్తే..క్లెయిమ్ ప్రక్రియలో ఉండే ఆలస్యం, పత్రాల ప్రక్రియ వంటి ఇబ్బందులు చాలా వరకు తగ్గిపోతాయని అధికారులు భావిస్తున్నారు.
ఈ కొత్త సౌకర్యాలు అమల్లోకి వస్తే.. EPF ఇకపై కేవలం పదవీ విరమణ తర్వాత మాత్రమే ఉపయోగపడే పొదుపుగా కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో బ్యాంక్ ఖాతాల్లాగే తక్షణంగా అందుబాటులో ఉండే నిధిగా మారనుంది. ముఖ్యంగా వైద్య ఖర్చులు, కుటుంబ అవసరాలు లేదా ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఏదేమైనా 2026కి ముందే ఈ సదుపాయాలు అందుబాటులోకి వస్తే.. EPF వ్యవస్థలో ఇది ఒక చారిత్రాత్మక మార్పుగా నిలవనుంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications